Independence Day 2020: భారత్ అంటే నాణ్యమైన వస్తువుల అడ్డా అనిపిద్దాం..ప్రధాని మోడీ సందేశం!

Independence Day 2020: భారత్ అంటే నాణ్యమైన వస్తువుల అడ్డా అనిపిద్దాం..ప్రధాని మోడీ సందేశం!
x
Highlights

Independence Day 2020: స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీ లో ఘనంగా జరిగాయి. ఎర్రకోట పై జెండా ఎగరేసిన ప్రధాని మోడీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

భారత్‌ అంటే నాణ్యమైన వస్తువుల అడ్డా అన్న గౌరవాన్ని తెచ్చుకుందాం.. అని ప్రధాని మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఢిల్లీ లో ఘనంగా జరిగిన 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎర్రకోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు.

''భారత్‌ తయారీ వస్తువులను ప్రపంచం ఆదరించేలా ఉత్పత్తి చేద్దాం. ఒకనాడు భారత వస్తువులు అంటే విశ్వవ్యాప్తంగా గౌరవం ఉండేది. మళ్లీ భారత వస్తువులకు పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నం చేద్దాం. భారత్‌ అంటే నాణ్యమైన వస్తువుల అడ్డా అన్న గౌరవాన్ని తెచ్చుకుందాం. మన వస్తువులను మనమే గౌరవించకుంటే ప్రపంచం ఎలా గౌరవిస్తుంది. పీపీఈ కిట్లు, ఎన్‌ 95 మాస్కులు కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉండేది. నాలుగు నెలల్లో స్వయం సమృద్ధి సాధించి ఇతర దేశాలకూ ఎగుమతి చేస్తున్నాం. మన యువతకు కొత్త అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. వోకల్‌ ఫర్‌ లోకల్‌ అనే మాటను నిలబెట్టుకుందాం'' అని ప్రధాని మోడీ జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం పేర్కొన్నారు.

''స్వాతంత్ర్య సంగ్రామ ప్రేరణతో దేశం ముందుకు సాగుతోంది. ఆత్మనిర్భర్‌ భారత్‌ పేరుతో దేశం ముందడుగు వేయడానికి సిద్ధమైంది. కరోనా విపత్కర సమయంలోనూ దేశం ఒక్కటై నిలబడింది. 25 ఏళ్లు వచ్చిన ప్రతిబిడ్డ సొంతకాళ్లపై నిలబడాలని కుటుంబం కోరుకుంటోంది. 75 ఏళ్ల తర్వాత కూడా భారత్‌ స్వయం సమృద్ధి సాధించలేకపోయింది. ఈ క్షణం నుంచి స్వయం సమృద్ధికి బలమైన సంకల్పంతో ముందుకువెళ్లాలి. ప్రపంచం ఇప్పుడు పరస్పర ఆధారితం.. ఏ ఒక్కరూ ఏకాకిగా మనలేరు. భారత్‌ అంటే కేవలం క్రమశిక్షణ మాత్రమే కాదు.. ఉన్నత విలువలతో కూడిన జీవనం. ప్రపంచ కల్యాణానికి మనవంతు కూడా నిరంతరం చేస్తున్నాం. ఆత్మనిర్భర్‌ భారత్‌ అనేది కేవలం నినాదం మాత్రమే కాదు. ఆత్మనిర్భర్‌ భారత్‌ కోసం మనందరి సంకల్పం కావాలి. దేశ యువత ఆత్మ విశ్వాసంతో ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధించాలి'' అని మోడీ పిలుపునిచ్చారు.

ఇంకా ప్రధాని ఈ సందర్భంగా ఏమన్నారంటే..

- ఒక సాధారణ భారతీయుడి శక్తి, స్వావలంబన భారత ప్రచారానికి చాలా పునాది.

- ఈ బలాన్ని కొనసాగించడానికి, అన్ని స్థాయిలలో నిరంతర పని జరుగుతోంది

- కరోనా కాలంలో, డిజిటల్ ఇండియా ప్రచారం యొక్క పాత్ర ఏమిటో మనం చూశాము. గత నెలలోనే భీమ్ యుపిఐ నుండి మాత్రమే సుమారు 3 లక్షల కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగాయి

-స్వావలంబన కలిగిన భారతదేశాన్ని నిర్మించడంలో, ఆధునిక భారతదేశాన్ని నిర్మించడంలో, కొత్త భారతదేశాన్ని నిర్మించడంలో, సంపన్నమైన మరియు సంపన్నమైన భారతదేశాన్ని నిర్మించడంలో దేశ విద్యకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలోచనతో, దేశానికి కొత్త జాతీయ విద్యా విధానం వచ్చింది.

- మధ్యతరగతి నుండి వచ్చే ప్రొఫెషనల్స్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తంలో తమదైన ముద్ర వేస్తారు.

మధ్యతరగతికి అవకాశం కావాలి, మధ్యతరగతికి ప్రభుత్వ జోక్యం నుండి స్వేచ్ఛ అవసరం.

- మీ ఇంటి కోసం గృహ రుణం యొక్క EMI చెల్లింపు వ్యవధిలో 6 లక్షల రూపాయల వరకు రిబేటు పొందడం ఇదే మొదటిసారి.

అసంపూర్తిగా ఉన్న వేలాది ఇళ్లను పూర్తి చేయడానికి గత ఏడాది 25 వేల కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేశారు.

- వ్యవసాయ మార్కెటింగ్ లో నూతన శకానికి నాంది పలికి ప్రభుత్వ బంధనాల నుండి రైతులను విముక్తి చేస్తున్నాం

వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు తగిన ప్రోత్సాహం కల్పిస్తున్నాం

దేశంలో ఎక్కడైనా ఏ ప్రాంతంలోనైనా రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు అవకాశాలు కల్పిస్తున్నాం.

- వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు తగిన ప్రోత్సాహం కల్పిస్తున్నాం

- దేశంలో యువత కు నైపుణ్య శిక్షణ ఉపాధి కోసం కొత్త పథకాలను తీసుకు వచ్చాము.

- దేశంలోని రైతులకు ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించడానికి, కొద్ది రోజుల క్రితం, రూ .1 లక్ష కోట్ల వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి సృష్టించబడింది.

- అభివృద్ధి విషయంలో దేశంలోని చాలా ప్రాంతాలు కూడా వెనుకబడి ఉన్నాయి.

- 110 కి పైగా ఆకాంక్ష జిల్లాలను ఎన్నుకోవడం ద్వారా, దేశ ప్రజలకు మెరుగైన విద్య, మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు, మెరుగైన ఉపాధి అవకాశాలు లభించేలా అక్కడ ప్రత్యేక ప్రయత్నాలు జరుగుతున్నాయి

పటిష్ట భద్రత..

ఓవైపు పటిష్ట భద్రత... మరోవైపు కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తల నడుమ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సుమారు 4 వేల మంది అథితులు హాజరయ్యారు. అదే స్థాయిలో భద్రతా సిబ్బంది కూడా మోహరించారు. కొవిడ్‌-19 మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని ఎర్రకోట వద్ద పంద్రాగస్టు వేడుకలను అత్యంత జాగ్రత్తగా నిర్వహించారు. అతిథుల కోసం వేదిక వద్ద మాస్కులు అందుబాటులో ఉంచారు. కుర్చీల మధ్య రెండు గజాల దూరం ఉండేలా ఏర్పాట్లు చేశారు. వేడుకలకు హాజరయ్యే ప్రతి ఒక్కరికీ థర్మల్‌ స్క్రీనింగ్‌ చేశారు. వేదిక సమీపంలో మెడికల్‌ బూత్‌లను, అంబులెన్సులను ఏర్పాటు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ నిర్వహణకు ఎన్‌ఎస్‌జీ, ఎస్‌పీజీ, ఐటీబీపీ తదితర భద్రతా సంస్థలతో కలిసి బహు అంచెల భద్రతను కల్పించారు. ఎర్రకోట వద్ద 4,000 మంది భద్రతా సిబ్బందిని, 300 కెమెరాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories