S-400 Sudarshan missile: గగనతల రక్షణలో 'సుదర్శన్'.. ఎస్-400 క్షిపణి వ్యవస్థ శక్తిసామర్థ్యాలను ప్రదర్శించిన భారత వాయుసేన

S-400 Sudarshan missile : భారత వాయుసేన ఎస్-400 సుదర్శన్ క్షిపణి వ్యవస్థ అధికారిక వీడియోను విడుదల చేసింది.
x

S-400 Sudarshan missile (Image Source: IAF)

Highlights

S-400 Sudarshan missile: భారత వాయుసేన ఎస్-400 సుదర్శన్ క్షిపణి వ్యవస్థ అధికారిక వీడియోను విడుదల చేసింది. వాయుశక్తి-2026 విన్యాసాల్లో ఈ రక్షణ వ్యవస్థ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

S-400 Sudarshan missile: భారత గగనతల రక్షణ కవచంగా చెప్పుకునే 'సుదర్శన్' (ఎస్-400) లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థకు సంబంధించిన అధికారిక వీడియోను భారత వాయుసేన (IAF) తొలిసారిగా విడుదల చేసింది. రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్‌లో రేపు (ఫిబ్రవరి 27న) జరగనున్న ప్రతిష్టాత్మక 'వాయుశక్తి-2026' విన్యాసాలకు ముందు ఈ వీడియో ను IAF షేర్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అత్యంత రహస్యంగా ఉంచే ఈ శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ పనితీరును వాయుసేన బహిర్గతం చేయడం ద్వారా భారత్ రక్షణ సామర్థ్యంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది.

పోఖ్రాన్ వేదికగా జరిగిన ఫుల్ డ్రెస్ రిహార్సల్స్‌లో ఎస్-400 వ్యవస్థ తన లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించిందని వాయుసేన అధికారులు వెల్లడించారు. శత్రువులకు చిక్కని, అజేయమైన శక్తిగా తమ ఎయిర్ వారియర్స్ రేపటి ప్రధాన ప్రదర్శన కోసం సర్వసిద్ధంగా ఉన్నారని ఎక్స్‌ (X) వేదికగా ప్రకటించారు. ఈ వ్యవస్థకు భారత్ 'సుదర్శన్ చక్రం'గా పేరుపెట్టడం గమనార్హం.

S-400 Sudarshan missile: గత ఏడాది మే నెలలో జరిగిన 'ఆపరేషన్ సిందూర్' సమయంలో ఈ ఎస్-400 వ్యవస్థ అద్భుతమైన పనితీరును కనబరిచినట్లు వాయుసేన గుర్తుచేసింది. సైనిక చరిత్రలోనే అత్యంత సుదూర ప్రాంతం నుండి శత్రు లక్ష్యాన్ని కూల్చివేసిన రికార్డును ఈ క్షిపణి వ్యవస్థ సొంతం చేసుకుందని పేర్కొంది. సరిహద్దుల వెంబడి వచ్చిన డ్రోన్లు, క్షిపణులను సుదూరంలోనే పసిగట్టి, వాటిని గాలిలోనే తుత్తునియలు చేసి భారత నగరాలను సురక్షితంగా ఉంచడంలో అప్పుడు సుదర్శన్ కీలక పాత్ర పోషించింది.

రష్యా నుంచి బిలియన్ డాలర్ల ఒప్పందంతో కొనుగోలు చేసిన ఎస్-400 ట్రయంఫ్ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైనది. ఇది సుమారు 400 కిలోమీటర్ల దూరంలోని విమానాలు, క్రూయిజ్ క్షిపణులు - డ్రోన్లను గుర్తించి ధ్వంసం చేయగలదు. భారత్ బహుళ అంచెల వాయు రక్షణ వ్యవస్థలో ఇది ఒక కీలక స్తంభంగా నిలుస్తోంది. దేశ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఈ క్షిపణి మోహరింపు స్పష్టం చేస్తోంది.

రేపు జరగనున్న 'వాయుశక్తి-2026'లో కేవలం క్షిపణుల ప్రదర్శన మాత్రమే కాకుండా, భారత వాయుసేనలోని దిగ్గజ యుద్ధ విమానాలు కూడా పాలుపంచుకోనున్నాయి. దేశీయంగా తయారైన తేజస్, ఫ్రాన్స్ నుంచి వచ్చిన రఫేల్, సుఖోయ్-30 MKI, మిరాజ్-2000 వంటి విమానాలు ఆకాశంలో విన్యాసాలు చేయనున్నాయి. అలాగే అపాచీ, చినూక్ హెలికాప్టర్లు, సి-17 వంటి రవాణా విమానాలు తమ శక్తిని చాటనున్నాయి.

S-400 Sudarshan missile: యుద్ధ తంత్రాలతో పాటు విపత్తుల సమయంలో మానవతా దృక్పథంతో చేసే సహాయక చర్యలను (HADR) కూడా ఈ విన్యాసాల్లో ప్రదర్శించనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను తరలించడం, సహాయక సామాగ్రిని అందించడం వంటి అంశాలలో వాయుసేన సన్నద్ధతను ఈ ప్రదర్శన వివరిస్తుంది. జైసల్మేర్ ప్రాంతంలో జరగనున్న ఈ మహా విన్యాసాల కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories