దేశవ్యాప్తంగా హై అలర్ట్ ..ఆప్ఘనిస్తాన్ మీదుగా భారత్‌లోకి చొరబడిన ఉగ్రవాదులు ..?

దేశవ్యాప్తంగా హై అలర్ట్ ..ఆప్ఘనిస్తాన్ మీదుగా భారత్‌లోకి చొరబడిన ఉగ్రవాదులు ..?
x
Highlights

పాకిస్ధాన్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించినట్టు నిఘా వర్గాలు నిర్ధారించాయి. ఆప్ఘనిస్తాన్ పాస్ పోర్టులతో దేశంలోకి ప్రవేశించినట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో వర్గాలు గుర్తించాయి.

పాకిస్ధాన్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించినట్టు నిఘా వర్గాలు నిర్ధారించాయి. ఆప్ఘనిస్తాన్ పాస్ పోర్టులతో దేశంలోకి ప్రవేశించినట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో వర్గాలు గుర్తించాయి. నిఘా వర్గాల హెచ్చరికలతో దేశ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. నలుగురు ఉగ్రవాదులతో పాటు ఓ ఐఎస్‌ఐ ఏజెంట్ కూడా భారత్‌లోకి ప్రవేశించినట్టు భావిస్తున్నారు. పాస్ పోర్టుల ఆధారంగా ఉగ్రవాదుల ఊహాచిత్రాలను రూపొందించిన ఐబీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేసింది. జనసామర్ధ్యం ఎక్కువగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడవచ్చంటూ నిఘా వర్గాలు హెచ్చరించాయి. కేంద్రం ఆదేశాలతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories