కాలువలో పడిన కారు.. నలుగురు విద్యార్థులు అదృశ్యం

కాలువలో పడిన కారు.. నలుగురు విద్యార్థులు అదృశ్యం
x
Highlights

ఘజియాబాద్‌లోని మురద్‌నగర్ ప్రాంతంలో ప్రమాదం చోటుచేసుకుంది.

ఘజియాబాద్‌లోని మురద్‌నగర్ ప్రాంతంలో ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి కాలువలో పడింది, దాంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు విద్యార్థులు అదృశ్యమైనట్టు తెలుస్తోంది. ఈ కారు డెహ్రాడూన్ నుండి ఢిల్లీ వెళుతుండగా ప్రమాదం జరిగింది. అందులో డ్రైవర్ సహా ఆరుగురు విద్యార్థులు ఉన్నట్టు సమాచారం. మురాద్‌నగర్‌లోని డిడౌలి గ్రామానికి కారు చేరుకున్నప్పుడు దట్టమైన పొగమంచు కారణంగా అకస్మాత్తుగా కారు నీటిలో పడిపోవడంతో ఈ సంఘటన జరిగింది.

అయితే ఇద్దరు విద్యార్థులు సురక్షితంగా కాలువ నుండి బయటకు రాగా, నలుగురు అదృశ్యమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని తప్పిపోయిన విద్యార్థులను వెతకడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని గుర్తించడంలో విఫలమయ్యారు. ఈ క్రమంలో తప్పిపోయిన విద్యార్థులను కనుగొనడానికి జాతీయ విపత్తు దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్) కు సమాచారం అందించారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం సంఘటనా స్థలికి చేరుకొని విద్యార్థులను వెతుకుతున్నారు. ఇవాళ సాయంత్రానికి కల్లా వారిని గుర్తించే అవకాశం ఉన్నట్టు తెలిసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories