మరణించడానికి రెండు గంటల ముందు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు.. బీజేపీ సీనియర్‌ నేత మృతి

మరణించడానికి రెండు గంటల ముందు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు.. బీజేపీ సీనియర్‌ నేత మృతి
x
Highlights

దీపావళి పండగవేళ పంజాబ్‌ బీజేపీలో విషాదం చోటు చేసుకుంది. పంజాబ్‌ బీజేపీ మాజీ అధ్యక్షుడు, సీనియర్‌ నేత కమల్‌ శర్మ(48) ఆదివారం ఫెరొజెపూర్ జిల్లాలో...

దీపావళి పండగవేళ పంజాబ్‌ బీజేపీలో విషాదం చోటు చేసుకుంది. పంజాబ్‌ బీజేపీ మాజీ అధ్యక్షుడు, సీనియర్‌ నేత కమల్‌ శర్మ(48) ఆదివారం ఫెరొజెపూర్ జిల్లాలో గుండెపోటుతో మృతి చెందారు. ఎప్పటిలాగే మార్నింగ్ వాక్‌కు వెళ్లిన కమల్ శర్మకు ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది. అదే సమయంలో ఆయనతో పాటు ఉన్న సన్నిహితుడొకరు వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.

అయితే ఆసుపత్రికి తీసుకొచ్చేలోపే శర్మ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆయన గుండెపోటుతో మరణించడానికి రెండు గంటల ముందు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. కమల్ శర్మకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మృతిపట్ల బీజేపీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కమల్ మృతి పార్టీకి తీరని లోటని రాష్ట్ర బీజేపీ శాఖ సంతాపాన్ని వ్యక్తం చేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories