టూరిస్ట్ వీసాలపై వచ్చిన తబ్లిగి కార్యకర్తలు.. 5 ఏళ్ళు జైలు శిక్ష విధించవచ్చు

టూరిస్ట్ వీసాలపై వచ్చిన తబ్లిగి కార్యకర్తలు.. 5 ఏళ్ళు జైలు శిక్ష విధించవచ్చు
x
Highlights

వివిధ దేశాల నుంచి ఇండియాకు పర్యాటక వీసాలపై వచ్చిన దాదాపు 960 మంది విదేశీయుల వీసాలను రద్దు చేయడంతో పాటు వారి పాస్‌పోర్టులను బ్లాక్‌లిస్ట్‌లో పెడుతూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది.

వివిధ దేశాల నుంచి ఇండియాకు పర్యాటక వీసాలపై వచ్చిన దాదాపు 960 మంది విదేశీయుల వీసాలను రద్దు చేయడంతో పాటు వారి పాస్‌పోర్టులను బ్లాక్‌లిస్ట్‌లో పెడుతూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. అయితే విదేశీయులను విడిచి పెట్టాలని దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టు విచారణ ప్రారంభించగా, పోలీసులు తమ వాదనను వినిపించారు.

వీసా నిబంధనలను ఉల్లంఘించి, ఓ మత పరమైన కార్యక్రమంలో పాల్గొన్నారని, వీరికి 5 సంవత్సరాల వరకూ జైలుశిక్ష విధించవచ్చని ఢిల్లీ పోలీసులు హైకోర్టుకు వెల్లడించారు. టూరిస్ట్ వీసాలపై వచ్చిన వారు విశ్రాంతి తీసుకోవడం, సైట్ సీయింగ్, స్నేహితులు, బంధువులను కలుసుకోవడం వంటి పనులకు మాత్రమే పరిమితం కావాల్సి వుందని, స్వల్ప వ్యవధి యోగా కార్యక్రమాలకు, మెడికల్ ట్రీట్ మెంట్ చేయించుకోవచ్చని, అంతవరకే పరిమితం కావాలని, మరే ఇతర కార్యక్రమాల్లోనూ పాల్గొనరాదని పోలీసులు కోర్టు దృష్టికి తెచ్చారు.

వీరంతా వీసా నిబంధనలను ఉల్లంఘించిన వారేనని, ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతానికి వెళ్లి, దేశంలో కరోనా వ్యాప్తికి కారకులయ్యారని, వీరు ఇండియన్ ఫారినర్స్ యాక్ట్, సెక్షన్ 14 ప్రకారం నేరస్తులేనని తెలిపారు. పోలీసుల తరఫున వాదనలకు హాజరైన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ డీసీపీ జాయ్ టిర్కే, వీరంతా 2019 నాటి వీసా మాన్యువల్ విధానాలను పాటించలేదని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories