తొలిసారి సుప్రీంకోర్టులో కేసుల విచారణ ప్రత్యక్షప్రసారం

*జస్టిస్‌ ఎన్వీరమణ బెంచ్‌ విచారణలు ప్రత్యక్షప్రసారం

Jyothi
Published on: 26 Aug 2022 1:04 PM IST
For the First Time in Court History The Proceedings Were Broadcast live
X

తొలిసారి సుప్రీంకోర్టులో కేసుల విచారణ ప్రత్యక్షప్రసారం

Supreme Court: అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ప్రజలకు చేరువ చేసే క్రమంలో కీలక ముందడుగు పడింది. కోర్టు చరిత్రలో తొలిసారి ప్రొసీడింగ్స్‌ ప్రత్యక్ష ప్రసారం చేశారు. సీజేఐ ధర్మాసనం విచారణ ప్రత్యక్ష ప్రసారానికి జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. అత్యున్నత న్యాయస్థానంలో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా అన్ని కోర్టుల నుంచి ప్రత్యక్ష ప్రసారం జరగాలని ఆయన ఆకాంక్షించారు. జస్టిస్‌ ఎన్వీ రమణ పదవీ విరమణ సందర్భంగా న్యాయవాదులు భావోద్వేగానికి గురయ్యారు. ఆయన పనితీరుపై ప్రశంసలు కురిపించారు. ఆయన ఉన్నత ప్రమాణాలను నెలకొల్పారని కొనియాడారు.

Jyothi

Jyothi

Next Story