ఐదుగురు డాక్టర్లకు కరోనా పాజిటివ్‌

ఐదుగురు డాక్టర్లకు కరోనా పాజిటివ్‌
x
Highlights

కాశ్మీర్‌లో ఐదుగురు వైద్యులకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది.

కాశ్మీర్‌లో ఐదుగురు వైద్యులకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. ఈ ఐదుగురు వైద్యులలో, ముగ్గురు శ్రీనగర్ లోని శ్రీ మహారాజా హరి సింగ్ (ఎస్ఎంహెచ్ఎస్) ఆసుపత్రికి చెందిన ENT విభాగానికి చెందినవారు, అలాగే స్కిమ్స్ బెమినాకు చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ , శ్రీనగర్ లోని ప్రభుత్వ దంత కళాశాలకు చెందిన దంతవైద్యుడు ఉన్నారు. పాజిటివ్ గా పరీక్షింపబడిన ఐదుగురు వైద్యులలో నలుగురు శ్రీనగర్‌లో కోవిడ్ -19 పాజిటివ్ రోగికి చికిత్స చేసినట్లు తెలిసింది.

వారు చికిత్స చేసిన 29 ఏళ్ల మహిళ మరణించినట్టు తెలుస్తోంది. వారు ఆమె నుండి సంక్రమణకు గురై ఉంటారని (సిడి) ఆసుపత్రిలో పల్మోనాలజీ విభాగం అధిపతి డాక్టర్ నవీద్ నజీర్ అన్నారు. శ్రీనగర్ లోని హబ్బా కదల్ ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల మహిళ ఆదివారం సిడి ఆసుపత్రిలో మరణించింది.. దీంతో ఇక్కడ కరోనావైరస్ సంబంధిత మరణాల సంఖ్య 13 కి చేరుకుంది. ఇదిలావుంటే ఐదుగురు వైద్యులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో జమ్మూ కాశ్మీర్‌లో మొత్తం కరోనావైరస్ కేసులు ఇప్పుడు 1,188 కు చేరుకున్నాయి. ఇప్పటివరకు 13 మంది వైద్యులు, ముగ్గురు నర్సులకు కరోనావైరస్ భారిన పడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories