మరో బీజేపీ ఎమ్మెల్యేపై లైంగిక ఆరోపణలు.. కేసు నమోదు!

మరో బీజేపీ ఎమ్మెల్యేపై లైంగిక ఆరోపణలు.. కేసు నమోదు!
x
Highlights

ఉత్తరప్రదేశ్‌కు చెందిన బిజెపి ఎమ్మెల్యే, ఆయన ఆరుగురు కుటుంబ సభ్యులపై అత్యాచారం కేసు నమోదైంది. 40 ఏళ్ల మహిళ, తనను వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి తనపై...

ఉత్తరప్రదేశ్‌కు చెందిన బిజెపి ఎమ్మెల్యే, ఆయన ఆరుగురు కుటుంబ సభ్యులపై అత్యాచారం కేసు నమోదైంది. 40 ఏళ్ల మహిళ, తనను వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి తనపై అత్యాచారం చేశాడని భదోహి ఎమ్మెల్యే రవీంద్ర నాథ్ త్రిపాఠి మేనల్లుడిపై మొదట ఫిర్యాదు చేశారు. తరువాత ఆమె తన ఫిర్యాదులో రవీంద్ర నాథ్ త్రిపాఠి పేరును చేర్చినట్లు పోలీసులు తెలిపారు.

"వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చిన తరువాత ఎమ్మెల్యే మేనల్లుడు సందీప్ తివారీ లైంగిక సంబంధాలు ఏర్పరచుకున్నారని ఆమె చెప్పారు. ఎమ్మెల్యే మరియు కుటుంబంలోని ఇతర వ్యక్తులపై ఆమె ఆరోపణలు చేశారని.. దీనిపై ఫిర్యాదు అందిందని.. దీంతో వారందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేశామని పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) రామ్ బదన్ సింగ్ చెప్పారు.

రైలులో కలిసిన ఎమ్మెల్యే మేనల్లుడు తనను ఆరేళ్లుగా లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆ మహిళ ఆరోపించింది. అంతేకాదు 2017 లో యుపి అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆమె 30 రోజుల పాటు ఒక హోటల్‌ ఉన్నారు.. ఆ సమయంలో ఎమ్మెల్యే మరియు ఇతర వ్యక్తులు- చంద్రభూషణ్ త్రిపాఠి, దీపక్ తివారీ, నితీష్ తివారీ మరియు ప్రకాష్ తివారీ- తనపై అత్యాచారం చేశారని ఆరోపించారు. లైంగిక దాడి విషయాన్ని బయటపెడితే చంపేస్తామని బెదిరించారని, అందుకే ఇన్నాళ్లు మౌనం వహించానని ఫిర్యాదులో పేర్కొంది. ఎమ్మెల్యే, అనుయాయుల కీచక క్రీడతో గర్భవతిని కూడా అయ్యానని, అయితే బలవంతంగా అబార్షన్‌​ చేయించారని వెల్లడించింది.

అయితే ఈకేసు, ఆమె ఆరోపణలపై ఎమ్మెల్యే రవీంద్ర నాథ్ స్పందించారు. తనను పరువు తీసే రాజకీయ కుట్రలో భాగమే ఈ ఆరోపణలు అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పూర్తి స్థాయి దర్యాప్తులో ఆరోపణలు నిజమని తేలితే నేను మరియు నా కుటుంబం ఉరికి సిద్ధంగా ఉన్నాము" అని ఆయన అన్నారు.

ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని నగర పోలీసు చీఫ్ తెలిపారు. "ఫిర్యాదుదారు అనేక ప్రదేశాల గురించి మాట్లాడారు, అదనపు ఎస్పీకి దర్యాప్తును అప్పగించాను. దర్యాప్తు ఫలితాల ఆధారంగా మేము చర్యలు తీసుకుంటాము" అని ఆయన చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories