విధి అత్యాచారం లాంటిది.. ఎంపీ భార్య వివాదాస్పద వ్యాఖ‌్యలు

విధి అత్యాచారం లాంటిది.. ఎంపీ భార్య వివాదాస్పద వ్యాఖ‌్యలు
x
Highlights

ఇంటి వద్ద వరదనీరు చేరితే విధి అత్యాచార అంశంతో పోలూస్తూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు కేరళ రాష్ట్రానికి చెందిన ఎంపీ భార్య లిండా. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో చేశారు. కేరళలో కురిసిన వర్షాలకు వరదనీరు నిలిచిపోయింది.

ఇంటి వద్ద వరదనీరు చేరితే విధి అత్యాచార అంశంతో పోలూస్తూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు కేరళ రాష్ట్రానికి చెందిన ఎంపీ భార్య లిండా. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. కేరళలో కురిసిన వర్షాలకు వరదనీరు నిలిచిపోయింది. కేరళలోని ఎర్నాకుళం ఎంపీ హిబీ ఈడెన్ భార్య లిండా కొచ్చిలోని, తన ఇంటి వద్ద నిలిచిన వరద నీటినిపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వరద నీటీలో భర్త హిబీ ఐస్ క్రీం తింటున్న వీడియోను సోమవారం ఫేస్‌బుక్‌లో పోస్టు చేస్తూ.. విధి అత్యాచారం లాంటిది.. దానిని అడ్డుకోలేకపోతే ఎంజాయ్ చేయాలని ఫేస్‌బుక్ పోస్టు చేశారు. లిండా ప్రముఖ జర్నలిస్టు కూడా.

లిండా ఈడెన్ చేసిన పోస్టుపై తీవ్ర దుమారం రేగింది. దీనిపై నెటిజన్లు పలు విమర్శలు చేస్తున్నారు. అత్యాచారాలపై పోరాటం చేస్తుంటే ప్రముఖులే ఇలాంటి కామెంట్లు పోస్టు చేయడం ఏంటని విమర్శిస్తున్నారు. లిండా ఈడెన్ క్షమాపణ చేప్పాలని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే స్పందించిన లిండా ఫేస్‌బుక్‌లో క్షమాపణలు చెబుతూ పోస్టు చేశారు. ఎవరి మనోభావాలను అవమానించే విధంగా తాను పోస్టు చేయలేదని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories