మోదీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న మూడు ఆర్ధిక సమస్యలు ఇవే : ఆర్‌బిఐ మాజీ గవర్నర్

మోదీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న మూడు ఆర్ధిక సమస్యలు ఇవే : ఆర్‌బిఐ మాజీ గవర్నర్
x
Highlights

ఆర్థిక మందగమనం మధ్య నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న మూడు ప్రధాన సమస్యలను ఎత్తిచూపారు ఆర్‌బిఐ మాజీ గవర్నర్ వైవి రెడ్డి. అందులో.. స్థూల...

ఆర్థిక మందగమనం మధ్య నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న మూడు ప్రధాన సమస్యలను ఎత్తిచూపారు ఆర్‌బిఐ మాజీ గవర్నర్ వైవి రెడ్డి. అందులో.. స్థూల జాతీయోత్పత్తి ( జిడిపి ) వృద్ధి రేటు ఆరు త్రైమాసికాలకు నిరంతర క్షీణత, ఆర్థిక రంగంలో ఇబ్బందులు మరియు ఉపాధి కల్పన సమస్య ఉన్నాయి. వై.వి.రెడ్డి మాట్లాడుతూ, "జిడిపి సంఖ్యలు అంతకుముందు ఉన్నదానికంటే తక్కువగా ఉన్నాయి. దీనిని ఎవరూ ఖండించలేరు. ఆర్థిక రంగం ఇబ్బందుల్లో ఉంది... దీనిని కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ కూడా పాయింట్ అవుట్ చేశారు.

అలాగే, ఉపాధి విషయంలో కూడా తీవ్రమైన సమస్య ఉంది. - ఆర్థిక మందగమనంపై మోదీ ప్రభుత్వం తిరస్కరణ రీతిలో ఉందని అన్న ఆయన.. మోడీ ప్రభుత్వం ఆర్థిక మందగమనాన్ని అంగీకరించిందని అయితే పరిస్థితిని ఎదుర్కోవటానికి సంస్కరణల అవసరాన్ని కూడా గుర్తించాలని అన్నారు. అలాగే మేము ఇబ్బందుల్లో ఉన్నామని విస్తృతంగా చెప్పాలని కేంద్రానికి సూచించారు. ఒకవేళ ఇలా చేయకుండా ఉంటే.. నిర్మాణాత్మకంగా ఏదో తప్పుగా అయినా ఉండాలి లేదంటే ధర్మబద్ధంగా అయినా ఉండాలి అని ఆర్ధిక వ్యవస్థ చెబుతుంది" అని వైవి రెడ్డి చెప్పారు.

అంతేకాదు "సంస్కరణల అవసరాన్ని ప్రభుత్వం ఖండించడం లేదు. ఇది సరైనది అని భావించే విధంగా చర్చనీయాంశంగా ఉండవచ్చు. అలాగే ప్రభుత్వంలో సమస్య ఉందని ఎవరూ ఖండించడం లేదు" అని వైవీ రెడ్డి అభిప్రాయపడ్డారు. మాజీ ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ మోంటే సింగ్ అహ్లువాలియా పుస్తక ఆవిష్కరణలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం మరియు ప్రస్తుత ఆర్థిక సలహా మండలి సభ్యుడు బిబెక్ డెబ్రోయ్ కూడా పాల్గొన్నారు.

అంతకుముందు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థ ఏదో ఒక రకమైన ఇబ్బందుల్లో ఉందన్న విషయాన్నీ మోదీ ప్రభుత్వం ఖండిస్తోంది. ప్రభుత్వం ఆర్థిక సమస్యను అంగీకరించకపోతే, ప్రస్తుత మందగమనం నుండి భారత్ బయటకు రాదు అని మన్మోహన్ సింగ్ హెచ్చరించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories