జమ్మూ కాశ్మీర్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదుల హతం

జమ్మూ కాశ్మీర్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదుల హతం
x
Highlights

జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని వాన్‌పోరా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. వారి వద్ద నుంచి పెద్ద...

జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని వాన్‌పోరా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు స్థానిక ఉగ్రవాదులను పర్వేజ్ అలియాస్ మొయిస్ మరియు షకీర్ అలియాస్ జారార్లుగా గుర్తించారు. ఈ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులకు ఆలస్యంగా సమాచారం అందింది. దాంతో పోలీసులు, ఆర్మీ, సిఆర్‌పిఎఫ్ బృందాలు ఆపరేషన్ చేపట్టాయి. అరగంటలో, ఉగ్రవాదులు ఇద్దరూ చంపేశారు. ఎన్‌కౌంటర్‌కు ఆటంకం కలిగించడానికి భద్రతా దళాలపై రాళ్ళు రువ్వినప్పటికీ, సైనికులు ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్‌ చేశారు.

అంతకుముందు, పుల్వామా వంటి ఉగ్రవాద దాడి కుట్రను భద్రతా దళాలు గురువారం భగ్నం చేసిన సంగతి తెలిసిందే.స్ రాజ్‌పోరా రోడ్‌లోని షాదిపుర సమీపంలో తెల్లని రంగు శాంట్రో కారు దొరికింది, అక్కడ 50 కిలోల ఐఇడి (ఇంప్రొవైజ్డ్ పేలుడు పరికరం) స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు కుల్గాం జిల్లాలోని వాన్‌పోరా ప్రాంతంలో శనివారం ఉదయం ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాయి. పోలీసులు, సైన్యం, సిఆర్‌పిఎఫ్ సంయుక్త బృందం వాన్‌పోరా ప్రాంతానికి చేరుకుని సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories