జూన్‌ 19న రాజ్యసభ ఎన్నికలు

జూన్‌ 19న రాజ్యసభ ఎన్నికలు
x
Highlights

కరోనా వైరస్ వ్యాప్తి లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.

కరోనా వైరస్ వ్యాప్తి లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.నేడు కేంద్ర ప్రధాన ఎన్నికల కమీషనర్ సునీల్ అరోరా నేతృత్వంలో సమావేశమైన ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.

జూన్ 19వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరగనుండగా.. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని ఎన్నికల సంఘం వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ లో 4 రాజ్యసభ స్థానాలకు వైసీపీ నుంచి నలుగురు, టీడీపీ నుంచి ఒకరు పోటీలో ఉన్నారు. గుజరాత్ 4, జార్ఖండ్ 2, మధ్యప్రదేశ్ 3, రాజస్థాన్ 3, మేఘాలయ 1, మణిపూర్ 1 మొత్తం 55 ఖాళీల్లో ఇప్పటికే 37 స్థానాలు ఏకగ్రీవం కాగా.. 18 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories