Education For All: అందరికీ విద్య మోడీ ప్రభుత్వ లక్ష్యం: అమిత్ షా

Education For All: అందరికీ విద్య మోడీ ప్రభుత్వ లక్ష్యం: అమిత్ షా
x
Highlights

Education For All | ప్రధానమంత్రి "అందరికీ విద్య" మిషన్ నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించడానికి కేంద్ర ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం అన్నారు.

Education For All | ప్రధానమంత్రి "అందరికీ విద్య" మిషన్ నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించడానికి కేంద్ర ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం అన్నారు. మంగళవారం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా దేశానికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి, నూతన విద్యా విధానం 2020, బేటీ బచావో-బేటి పధావో, సమగ్రా శిక్షా అభియాన్ వంటి సంస్కరణల ద్వారా లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు.

"ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో మన ప్రభుత్వం పిల్లలను శక్తివంతం చేస్తోంది. ఎన్‌ఈపి, బేటి బచావో-బేటి పధావో, సమగ్రా శిక్షా అభియాన్ వంటి సంస్కరణల ద్వారా 'అందరికీ విద్య' అనే మిషన్ కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది". అని అమిత్ షా ట్వీట్ చేశారు.



అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం 2020 కవిడ్ -19 సంక్షోభంలో మరియు అంతకు మించి అక్షరాస్యత బోధన, అభ్యాసం పై దృష్టి పెట్టింది. ముఖ్యంగా అధ్యాపకుల పాత్ర, మారుతున్న బోధనలపై ఇతివృత్తం అక్షరాస్యత అభ్యాసాన్ని జీవితకాల అభ్యాస దృక్పథంలో హైలైట్ చేస్తుంది. అందువల్ల ప్రధానంగా యువత, పెద్దలపై దృష్టి పెడుతుంది. సెప్టెంబరు 8ను యునెస్కో అంతర్జాతీయ దోనోత్సవం గా 1966 అక్టోబర్ 26 న సాధారణ సమావేశంలో 14 వ సెషన్‌లో అంతర్జాతీయ అక్షరాస్యత దినంగా ప్రకటించింది. ఇది మొదటిసారిగా 1967 లో జరుపుకుంది. వ్యక్తులు, సంఘాలు మరియు సమాజాలకు అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యతను ఎత్తిచూపడం దీని లక్ష్యం.


Show Full Article
Print Article
Next Story
More Stories