అనుమానం పెనుభూతం : బీజేపీ నాయకురాలైన భార్యను హత్య చేసిన భర్త

అనుమానం పెనుభూతం : బీజేపీ నాయకురాలైన భార్యను హత్య చేసిన భర్త
x
Highlights

వివాహేతర సంబంధం అనుమానంతో బీజేపీ నాయకురాలిని ఆమె భర్త కాల్చి చంపాడు. ఈ ఘటన గుర్రుగ్రామ్ లో జరిగింది. హర్యానాలోని చార్కి దాద్రి ప్రాంతానికి చెందిన...

వివాహేతర సంబంధం అనుమానంతో బీజేపీ నాయకురాలిని ఆమె భర్త కాల్చి చంపాడు. ఈ ఘటన గుర్రుగ్రామ్ లో జరిగింది. హర్యానాలోని చార్కి దాద్రి ప్రాంతానికి చెందిన సునీల్ గోదారా, మునేష్ గోదారా (34) దంపతులు. సునీల్ ధన్వాపూర్ పారిశ్రామిక విభాగంలో సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. మునేష్ గోదారా బిజెపి కిసాన్ మోర్చ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. అయితే ఆమెపై కొంతకాలంగా అనుమానం పెంచుకున్నాడు సునీల్. స్థానిక బీజేపీ నాయకుడితో ఆమె వివాహేతర సంబంధం నడుపుతోందని వేధించడం మొదలుపెట్టాడు. ఈ విషయంలో దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం ఇంటికి తాగి వచ్చిన సునీల్ భార్యతో గొడవకు దిగాడు.

ఈ క్రమంలో గొడవ తీవ్రమైంది. దాంతో ఆమె తన పుట్టింటికి ఫోన్ చేసింది. ఆమె తమ్ముడు ఎస్.కె.జఖర్ తో ఫోనులో మాట్లాడుతున్న సమయంలో ఆమెను తన భర్త కాల్చి చంపాడని.. తన చెల్లెలు చెప్పిందని అతను వెల్లడించారు. మునేష్ గోదారా తండ్రి చందర్‌భాన్ ఫిర్యాదు మేరకు గురుగ్రామ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం సునీల్ పరారీలో ఉన్నాడు. కాగా సునీల్ తాగి ఇంటికి వచ్చిన తర్వాత శనివారం రాత్రి దంపతులు గొడవ పడ్డారని నిందితుడి తండ్రి తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories