వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేసిన మహిళా కమిషన్.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి..

వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేసిన మహిళా కమిషన్.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి..
x
పార్లర్ నిర్వాహకులను నిలదీస్తున్న స్వాతి మలివాల్ బృందం
Highlights

వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేసిన మహిళా కమిషన్.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి..

దేశ రాజధాని ఢిల్లీలోని మసాజ్ పార్లర్లలో కొంతకాలంగా గుట్టుగా సాగుతున్న వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేసింది మహిళా కమిషన్. దీంతో యువతులకు సెక్స్ రాకెట్ నుంచి విముక్తి కల్పించారు మహిళా కమిషన్ సభ్యులు. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ నేతృత్వంలోని బృందం.. బురారీ ప్రాంతంతోపాటు పశ్చిమ ఢిల్లీలోని ద్వారకలలో మసాజ్ సెంటర్లు, స్పాలపై దాడి నిర్వహించింది. దాంతో భారీ ఎత్తున సెక్స్ రాకెట్ ముఠా నడుస్తుందని వారు కనుగొన్నారు. భారీ ఎత్తున విటులు, పలువురు యువతులను అరెస్ట్ చేయించారు. ఈ దాడిలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి.

మసాజ్ పార్లర్ల నుంచి వేలాది కండోములతోపాటు అమ్మాయిల ధరలను నిర్ణయిస్తూ ఏర్పాటు చేసిన కార్డులను పోలీసులు, మహిళా కమిషన్ సభ్యులు స్వాధీనం చేసుకున్నారు. యువతుల అశ్లీల ఫొటోలతోపాటు వాటిపై ఉన్న ధరలు చూసి మహిళా కమిషన్ సభ్యులు విస్తుపోయారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడ్డ నిర్వాహకులను వదిలిపెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇకపై నగరంలో ఎక్కడ ఇటువంటి కార్యకలాపాలు జరిగినా తమకు సమాచారం అందించాలని మహిళా కమిషన్ సభ్యులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories