Missing Crisis in Delhi: ఇది నిజమేనా? పోలీసుల అధికారిక వివరణ ఇదే

Missing Crisis in Delhi: ఇది నిజమేనా? పోలీసుల అధికారిక వివరణ ఇదే
x

Missing Crisis in Delhi: ఇది నిజమేనా? పోలీసుల అధికారిక వివరణ ఇదే

Highlights

Missing Crisis in Delhi: ఢిల్లీలో మిస్సింగ్ గర్ల్స్ హైప్ పెయిడ్ ప్రమోషన్ కారణమని పోలీసులు స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక.

ఢిల్లీ నగరంలో అమ్మాయిలు కనిపించకుండా పోతున్నారన్న ప్రచారం చెలరేగిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కీలక ప్రకటన చేశారు. సోషల్ మీడియా మరియు కొంతమంది వ్యక్తులు ప్రచారం చేసిన గణాంకాలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయని, అవి చెల్లింపుతో చేసిన ప్రమోషన్‌లో భాగమని పోలీసులు స్పష్టం చేశారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించి ఆర్థిక లాభాలు పొందేందుకు ఈ ప్రచారం జరిగిందని తెలిపారు.

జనవరి మొదటి 15 రోజుల్లో 807 మంది కనిపించకుండా పోయారని వచ్చిన వార్తల్లో నిజం లేదని పోలీసులు వెల్లడించారు. ఈ సంఖ్యలను ఉద్దేశపూర్వకంగా అతిశయోక్తిగా చూపించారని పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం ద్వారా ప్రజలను భయపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కొన్ని వర్గాల సమాచారం ప్రకారం, కనిపించని పిల్లలపై తెరకెక్కుతున్న ఒక సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ ప్రచారం ప్రారంభమైందని అనుమానిస్తున్నారు. దీనిపై ఆన్‌లైన్‌లో కూడా విస్తృత చర్చ జరిగింది.

పోలీసుల గణాంకాల ప్రకారం, జనవరి నెలలో మొత్తం 1,777 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఇది గత సంవత్సరం నెలవారీ సగటు కంటే తక్కువని తెలిపారు. 2025 సంవత్సరంలో మొత్తం 24,508 కేసులు నమోదయ్యాయని, నెలకు సగటున 2,000కు పైగా కేసులు ఉంటాయని వెల్లడించారు.

2016 నుంచి 2025 వరకు దాదాపు 1.80 లక్షల మందిని వారి కుటుంబాలతో కలిపామని పోలీసులు తెలిపారు. ‘ఆపరేషన్ మిలాప్’ వంటి కార్యక్రమాలు మరియు ఏఐ ఆధారిత సాంకేతికత వల్ల రికవరీ రేటు మెరుగుపడిందని పేర్కొన్నారు. మిస్సింగ్ కేసుల ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉందని చెప్పారు.



Show Full Article
Print Article
Next Story
More Stories