పార్కింగ్‌ వివాదం..పోలీసులు, లాయర్ల మధ్య ఘర్షణ

పార్కింగ్‌ వివాదం..పోలీసులు, లాయర్ల మధ్య ఘర్షణ
x
Highlights

దేశ రాజధానిలో పోలీసులు, న్యాయవాదులు మధ్య మొదలైన పార్కింగ్ వివాదం చినికి చినికి గాలివానలా మారింది. ఇరు వర్గాల ఘర్షణలతో ఢిల్లీలోని తిస్‌ హజారీ కోర్టు...

దేశ రాజధానిలో పోలీసులు, న్యాయవాదులు మధ్య మొదలైన పార్కింగ్ వివాదం చినికి చినికి గాలివానలా మారింది. ఇరు వర్గాల ఘర్షణలతో ఢిల్లీలోని తిస్‌ హజారీ కోర్టు ప్రాంగణం దద్దరిల్లింది.

తిస్‌ హజారీ కోర్టు ఆవరణలోని పార్కింగ్‌ విషయంలో కొంతమంది లాయర్లు, పోలీసుల మధ్య వివాదం జరిగింది. చిన్నగా మొదలైన ఈ వివాదం, కొద్దిసేపటికే తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు, లాయర్లు రెండు వర్గాలుగా విడిపోయి దాడులకు దిగడంతో ఘర్షణ వాతావణం నెలకొందని తెలుస్తోంది.

ఈ ఘర్షణల్లో పోలీసులు కాల్పులు జరిపారని న్యాయవాదులు ఆరోపించారు. అటు పోలీస్ డిపార్టుమెంట్ కు చెందిన పలు వాహనాలకు కొందరు నిప్పంటించారు. ఈ ఘర్షణల్లో పలువురు గాయపడగా ఓ లాయర్ పరిస్థితి మాత్రంగా విషమంగా మారడంతో, పోలీసులు కోర్టు గేట్లకు తాళం వేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories