Coronavirus: ఢిల్లీలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 508 కొత్త కేసులు

Coronavirus: ఢిల్లీలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 508 కొత్త కేసులు
x
Representational Image
Highlights

ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.. గత 24 గంటల్లో అక్కడ 508 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.

ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.. గత 24 గంటల్లో అక్కడ 508 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి, దీంతో మొత్తం 13,418 కు చేరింది. గత 24 గంటల్లో, భారతదేశంలో కోలుకున్న మరియు మరణించిన వారి సంఖ్య కూడా పెరిగింది. దేశంలో మొత్తం 131,868 కరోనావైరస్ కేసులలో 54,441 మంది కోవిడ్ -19 సంక్రమణ నుండి కోలుకోగా, 3,867 మంది దీనికి బలి అయ్యారు. దేశంలో అత్యధికంగా ధృవీకరించబడిన కేసులు మహారాష్ట్ర నుండి 47,190, తమిళనాడు 15,512, గుజరాత్ 13,664, ఢిల్లీ 13,418 ఎక్కువగా ఉండగా..

మొత్తం 3,867 మంది మరణించిన వారిలో, మహారాష్ట్ర 1,577 మరణాలతో అగ్రస్థానంలో ఉండగా, గుజరాత్ 829, మధ్యప్రదేశ్ 281, పశ్చిమ బెంగాల్ 269, ఢిల్లీ 231 ఉన్నాయి. రాజస్థాన్‌లో అంటువ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య 160 కాగా, ఉత్తరప్రదేశ్‌లో 155, తమిళనాడులో 103, ఆంధ్రప్రదేశ్‌లో 56 మంది మరణించారు. తెలంగాణలో 49, కర్ణాటకలో 42, పంజాబ్‌లో 39 మందికి చేరింది. జమ్మూ కాశ్మీర్‌లో 21, హర్యానాలో 16, బీహార్‌లో 11 మరణాలు సంభవించాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories