Coronavirus updates in Tamilnadu: తమిళనాడులో క‌రోనా ఉధృతి

Coronavirus updates in Tamilnadu: తమిళనాడులో క‌రోనా ఉధృతి
x
Corona updates in Tamil nadu
Highlights

Coronavirus updates in Tamilnadu: త‌మిళనాడులో క‌రోనా ఉధృతి కొన‌సాగుతుంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

Coronavirus updates in Tamilnadu: త‌మిళనాడులో క‌రోనా ఉధృతి కొన‌సాగుతుంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటిగా నిలుస్తోంది. తాజా నివేదిక ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 6,972 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే గ‌డిచిన 24 గంట‌ల్లో 88 మంది మృతి చెందిన‌ట్టు వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం తెలిపింది.

దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,27,688కి చేరింది. ఇక వీటిలో కరోనా నుంచి కోలుకుని 1,66,956 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 57,073 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారినపడి 3,659 మంది మరణించారు.

ఇదిలా ఉండగా దేశంలో గడిచిన 24 గంటల్లో 47,704 కరోనా కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 14,83,157కు చేరింది. ఇప్పటివరకు దేశంలో 33,425 మంది కరోనాతో మృత్యువాత పడినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ మంగళవారం తెలియజేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories