గ్రీన్ జోన్ల మధ్య ప్రయాణాలకు ఈ-పాస్ అవసరంలేదంటున్న ముఖ్యమంత్రి!

గ్రీన్ జోన్ల మధ్య ప్రయాణాలకు ఈ-పాస్ అవసరంలేదంటున్న ముఖ్యమంత్రి!
x
Highlights

రాష్ట్రంలో ఒక గ్రీన్ జోన్ నుండి మరొక గ్రీన్ జోన్ వెళ్ళడానికి ఇ-పాస్ అవసరం లేదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ప్రధాన...

రాష్ట్రంలో ఒక గ్రీన్ జోన్ నుండి మరొక గ్రీన్ జోన్ వెళ్ళడానికి ఇ-పాస్ అవసరం లేదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ప్రధాన కార్యదర్శి వెల్లడించిన మార్గదర్శకాలను పాటించాలని, ప్రజలు అనవసరంగా ఇళ్లనుంచి బయటకు రాకుండా నిరోధించాలని అన్నారు. ఇక శనివారం జరిగే ఈద్ పండుగను ఇంట్లోనే జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.. అలాగే వారు భౌతిక దూరం పూర్తిగా అనుసరించాలని సూచించారు. కరోనా సంక్రమణను నివారించడం మా మొదటి ప్రాధాన్యత అని సిఎం అన్నారు. కాబట్టి, అన్ని జిల్లాలు ఈ పద్ధతిలో చాలా జాగ్రత్తగా పనిచేయాలని చెప్పారాయన.

మరోవైపు మే 22 న రాష్ట్రంలో కొత్తగా 189 కరోనా రోగులు కనుగొనబడినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అలాగే 246 మంది రోగులు ఆరోగ్యంగా కోలుకొని ఇంటికి వెళ్లారు. రాష్ట్రంలో 2809 క్రియాశీల కరోనా కేసులు ఉన్నాయి. కట్ని, నర్సింగ్‌పూర్ జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు రాలేదు, అగర్-మాల్వా, అలీరాజ్‌పూర్, అనుప్పూర్, చింద్వారా మరియు హర్దా జిల్లాలు కరోనా నుండి సంక్రమణ రహితంగా మారాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories