coronavirus Updates: రికవరీ రేటు 26.65% కి పెరిగింది..

coronavirus Updates: రికవరీ రేటు 26.65% కి పెరిగింది..
x
Representational Image
Highlights

దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 39 వేల 242 కు పెరిగింది. శనివారం మహారాష్ట్రలో 790, గుజరాత్‌లో 333, ఉత్తరప్రదేశ్‌లో 159, పంజాబ్‌లో 187, మధ్యప్రదేశ్‌లో 73...

దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 39 వేల 242 కు పెరిగింది. శనివారం మహారాష్ట్రలో 790, గుజరాత్‌లో 333, ఉత్తరప్రదేశ్‌లో 159, పంజాబ్‌లో 187, మధ్యప్రదేశ్‌లో 73 సహా 1900 కి పైగా పాజిటివ్ కేసులు వచ్చాయి. ఈ గణాంకాలు covid19india.org, రాష్ట్ర ప్రభుత్వాల సమాచారం ప్రకారం ఉన్నాయి. అయితే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలో వ్యాధి సోకిన వారి కోలుకోవడం వేగంగా పెరిగింది. గత 24 గంటల్లో గరిష్టంగా 1061 మంది ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రికవరీ రేటు 26.65% కి పెరిగింది.

ప్రస్తుతం 37 వేల 776 మంది సోకినవారు ఉన్నారు. 26 వేల 535 మంది చికిత్స పొందుతున్నారు. వివిధ రాష్ట్రాల్లో మొత్తం 10 వేల 18 మందికి వ్యాధి నయం కావడంతో డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం1223 మంది మరణించారు. మరోవైపు మహారాష్ట్రలో ఇవాళ ముగ్గురు పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చింది.


Show Full Article
Print Article
Next Story
More Stories