'జనతా కర్ఫ్యూ' : ప్రయాణికులకు షాక్.. ఈ రైళ్లను నిలిపివేస్తున్నట్టు ప్రకటన

జనతా కర్ఫ్యూ : ప్రయాణికులకు షాక్.. ఈ రైళ్లను నిలిపివేస్తున్నట్టు ప్రకటన
x
No Trains on Sunday
Highlights

'జనతా కర్ఫ్యూ' కారణంగా ఆదివారం అన్ని ప్యాసింజర్ రైళ్లకు పాన్-ఇండియా షట్డౌన్ చేయనున్నట్లు భారతీయ రైల్వే శుక్రవారం ప్రకటించింది.

''జనతా కర్ఫ్యూ' కారణంగా ఆదివారం అన్ని ప్యాసింజర్ రైళ్లకు పాన్-ఇండియా షట్డౌన్ చేయనున్నట్లు భారతీయ రైల్వే శుక్రవారం ప్రకటించింది.ఇందులో భాగంగా మార్చి 21 న 22:00 గంటల నుండి మార్చి 22 న 24:00 గంటల వరకు అన్ని రైళ్లను నిలిపివేస్తామని భారతీయ రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే అప్పటికే ఉదయం 7:00 గంటలకు నడుస్తున్న ప్యాసింజర్ రైళ్లను మాత్రం గమ్యస్థానాలకు వెళ్ళడానికి ''జనతా కర్ఫ్యూ' రోజున అనుమతిస్తారు. మెయిల్ మరియు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు సేవలను నిలిపివేస్తాయని, అన్ని సబర్బన్ రైలు సర్వీసులు కనీస స్థాయికి తగ్గించబడతాయని భారతీయ రైల్వే పేర్కొంది. కరోనావైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, ''జనతా కర్ఫ్యూ' కారణంగా డిమాండ్ తక్కువగా ఉంటుందని కూడా రైల్వే చెబుతోంది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై మరియు సికింద్రాబాద్‌లలోని సబర్బన్ సేవలను కనీస స్థాయికి తగ్గించాలని ఆదేశాలు ఇచ్చారు.

ఇప్పటికే నడుస్తున్న రైళ్ల ద్వారా ప్రయాణించే ప్రయాణీకులు, స్టేషన్‌లో ఉండటానికి ఇష్టపడేవారు రద్దీగా ఉండే పరిస్థితులను సృష్టించకుండా వెయిటింగ్ హాల్స్, వెయిటింగ్ రూములు మరియు కాంకోర్స్‌లలో ఉండాలని ఆదేశించారు. వీరికి తాగునీరు, చెల్లింపుపై రిఫ్రెష్‌మెంట్‌లు ఏర్పాటు చేశారు. రైలు రద్దు వల్ల ప్రభావితమైన ప్రయాణీకులకు ముందుగా బుకింగ్ చేసుకున్న టిక్కెట్ల డబ్బు వాపసు ఇవ్వడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన స్టేషన్లలోని పరిస్థితులపై జోనల్ రైల్వేలు నిశితంగా గమనిస్తాయి మరియు స్టేషన్లలో చిక్కుకుపోయిన ప్రయాణీకుల రద్దీని తొలగించడానికి ప్రత్యేక రైళ్లలో వారిని గమ్యస్థానాలకు చేరుస్తారు. అది కూడా ఆదివారం 7 గంటల లోపు మాత్రమే. ఒకవేళ 7 దాటితే మాత్రం ఎంపిక రైళ్లను మాత్రమే అనుమతిస్తారు. కాగా కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా ఇప్పటికే భారత రైల్వే 245 రైళ్లను రద్దు చేసింది.

ఇదిలావుంటే ''జనతా కర్ఫ్యూ' ద్వారా "సామాజిక దూరం" అనే పద్ధతిని పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పిలుపునిచ్చారు. ఈ మేరకు మార్చి 22 న ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ''జనతా కర్ఫ్యూ'లో ప్రజలు పాల్గొనాలని కోరారు. ఏ పౌరుడూ, అవసరమైన సేవల్లో ఉన్నవారిని మినహాయించి, వారి ఇళ్ళ నుండి బయటకు రాకూడదని సూచించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories