Coronavirus: మహారాష్ట్రలో కరోనా విజృంభణ

Coronavirus Spreading In Maharashtra
x

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Coronavirus: గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న కేసులు * కరోనా కట్టడికి పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్

Coronavirus: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి వేల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కట్టడికి ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించింది. ఈ క్రమంలో తాజాగా నమోదైన కేసులు మళ్లీ కలకలం రేపుతున్నాయి. గత కొంత కాలంగా పదివేలకు తక్కువగా నమోదైన కేసులు కాస్త.. మళ్లీ ఆ మార్క్‌ దాటాయి. గడిచిన 24గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాపత్ంగా 10వేల 216 కొత్త కేసులు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది.

గురువారం రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ నుంచి 6వేలకు పైగా బాధితులు కోలుకున్నట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ముంబై మహానగరంలో వెయ్యికి పైగా కేసులు నమోదు కాగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో రికవరీ రేటు 93.52 శాతంగా ఉన్నట్టు మహారాష్ట్ర సర్కార్ తెలిపింది.

మరోవైపు.. దేశంలో కొత్తగా పెరుగుతున్న కరోనా కేసుల్లో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, కర్ణాటకలో ఎక్కువగా ఉన్నట్టు కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా ఓ వైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది.. మరోవైపు కేసులు కూడా పెరుగుతుండటంతో ప్రభుత్వం పలు రాష్ట్రాలకు సూచనలు సైతం చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories