Coronavirus: రాజస్థాన్ లో కరోనావైరస్ షాకింగ్ విషయాలు

Coronavirus: రాజస్థాన్ లో కరోనావైరస్ షాకింగ్ విషయాలు
x
Highlights

రాజస్థాన్ లో కరోనావైరస్ కు సంబంధించి షాకింగ్ విషయాలు వెల్లడవుతున్నాయి.

రాజస్థాన్ లో కరోనావైరస్ కు సంబంధించి షాకింగ్ విషయాలు వెల్లడవుతున్నాయి. ప్రపంచంలోని ఇతర దేశాల మాదిరిగా కాకుండా రాజస్థాన్ రాష్ట్రంలో కరోనా సోకిన రోగులలో చాలా మంది యువకులు ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కనుగొనబడిన 1351 పాజిటివ్ కేసులలో 62 శాతం 40 సంవత్సరాల వయస్సులోపు ఉండటం విస్మయానికి గురిచేస్తోంది. ప్రపంచంలోని వివిధ దేశాలలో 60 ఏళ్లు పైబడిన వారికి ఎక్కువగా కరోనా పాజిటివ్ వస్తోంది.

కానీ రాజస్థాన్ లో మాత్రం ఇందుకు భిన్న పరిస్థితులు ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, రాజస్థాన్‌లో 60 ఏళ్లు పైబడిన రోగుల శాతం మొత్తం 10.88 శాతం మాత్రమే ఉంది. ఇక 70 ఏళ్లు పైబడిన వారు 1351 మంది రోగులలో, కేవలం 16 మంది మాత్రమే ఉన్నట్లు గుర్తించారు, వారిలో 7 గురు మహిళలు ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం రోగులలో, 826 మంది రోగులు 40 ఏళ్లలోపు ఉన్నారు. వారు మొత్తం 62% ఉన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories