Coronavirus: కేరళలో తొలి కరోనా మరణం

Coronavirus: కేరళలో తొలి కరోనా మరణం
x
Representational Image
Highlights

కేరళ రాష్ట్రంలో తొలి కరోనా వైరస్‌ మరణం నమోదైంది. కొచ్చిలోని కలమస్సేరి ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్న 69 ఏళ్ల వ్యక్తి శనివారం మృతి చెందారు.

కేరళ రాష్ట్రంలో తొలి కరోనా వైరస్‌ మరణం నమోదైంది. కొచ్చిలోని కలమస్సేరి ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్న 69 ఏళ్ల వ్యక్తి శనివారం మృతి చెందారు. అతను ఇటీవల దుబాయ్‌నుంచి ఇండియాకు వచ్చారు. అయితే ఆ వ్యక్తి ఈనెల 22న దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలతో బాధపడుతూ.. కొచ్చిలోని కలమస్సేరి మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో చేరాడు. అతడి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేస్తున్నారు. అయితే అప్పటికే వేరే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు నిన్న రాత్రి నుంచి హై బీపీ వచ్చింది. దీంతో అది విపరీతంగా పెరిగిపోయి శనివారం మరణించాడని..

కేరళ మంత్రి వి.ఎస్. సునీల్ కుమార్ కొచ్చిలో చెప్పారు. దీంతో దేశవ్యాప్త కరోనా వైరస్‌ మరణాల సంఖ్య 21కి చేరింది. మృతుడి భార్య, టాక్సీ డ్రైవర్‌ను కూడా కరోనావైరస్ పాజిటివ్‌గా పరీక్షించారు. అదే సమయంలో, అతను నివసిస్తున్న అపార్ట్మెంట్లో నివాసితులందరూ నిఘా మరియు నిర్బంధంలో ఉన్నారు. రోగి దుబాయ్ నుండి తిరిగి వచ్చినప్పుడు కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. అతనితో సంబంధాలు పెట్టుకున్న వారందరినీ గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. కాగా భారత్‌లో ఇప్పటివరకు 873 వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, కేరళలో ఆ సంఖ్య 164గా ఉంది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 39 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకావటం గమనార్హం.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories