Corona Cases: మళ్లీ మొదలైందా..?.. మహారాష్ట్రలో మరోసారి పెరుగుతున్న కరోనా కేసులు..

Corona Cases Are Once Again Increasing In Maharashtra
x

Corona Cases: మహారాష్ట్రలో మరోసారి పెరుగుతున్న కరోనా కేసులు 

Highlights

Corona Cases: బ్రిటన్, అమెరికాలో జోరుగా వ్యాప్తి చెందుతున్న EG 5.1

Corona Cases: కరోనా పేరు పెద్దగా వినిపించక చాలా రోజులు గడిచిపోయింది. కరోనా వైరస్ ఇక పోయినట్టేనని ప్రజలు కూడా భావిస్తున్నారు. కానీ, ఉన్నట్టుండి మహారాష్ట్రలో కరోనా కేసులు పెరగడం మొదలైంది. కరోనా మొదటి, రెండు విడతల్లో దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా కేసులు, మరణాలు వెలుగు చూడడం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మరో విడత అదే రాష్ట్రంలో కేసులు పెరగడం మొదలైంది.

ఒమిక్రాన్ ఈజీ.5.1 రకం వైరస్ కేసులు ఇప్పుడు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. దేశంలో ఈ తరహా వేరియంట్ ను గుర్తించడం ఇదే మొదటిసారి. ఈ వేరియంట్ ను మేలో గుర్తించినట్టు జీనోమ్ సీక్వెన్సింగ్ కోర్డినేటర్ డాక్టర్ రాజేష్ కార్యకర్తే తెలిపారు. బీజే మెడికల్ కళాశాలలో ఆయన సీనియర్ సైంటిస్ట్ గానూ పనిచేస్తున్నారు. మే నెలలో గుర్తించిన తర్వాత రెండు నెలలు గడిచిపోయిందని ఎక్స్ బీబీ.1.16, ఎక్స్ బీబీ.2.3 వేరియంట్ల మాదిరిగా దీని ప్రభావం లేదని వెల్లడించారు. అయినా కానీ రాష్ట్రంలో ఇటీవల ఈ కేసులు ఎక్కువగానే నమోదవుతున్నట్టు చెప్పారు.

రాష్ట్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం జులై చివరికి 70 కేసులుగా ఉంటే, ఆగస్ట్ 6 నాటికి 115కు పెరిగాయి. ఈ నెల 7 నాటికి 109 కేసులుగా ఉన్నాయి. నిజానికి ఈజీ.5.1 రకం కేసులు వేగంగా పెరుగుతుండడం పట్ల ఇటీవలే బ్రిటన్ ఆందోళన వ్యక్తం చేసింది. మహారాష్ట్రలో అత్యధికంగా ముంబైలో 43 కేసులు, పూణెలో 34 కేసులు, థానేలో 25 చొప్పున యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఈ కొత్త EG.5.1 ఇప్పటికే బ్రిటన్, అమెరికాలో జోరుగా వ్యాప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది. రోజువారీ కేసుల్లో దీనివే ఎక్కువ ఉంటున్నాయి. తాజాగా ఇది ఇండియాలోకీ ప్రవేశించింది. మహారాష్ట్రలోని ముంబై, పుణేలో దీని కేసులు వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా కరోనా కేసులు కొద్దిగా పెరిగాయి. ఇండియాలో కోట్ల మంది డబుల్ డోస్ వేసుకున్నారు కాబట్టి.. ఎరిస్ ప్రభావం అంతగా ఉండకపోవచ్చని నిపుణులు అంటున్నారు. ఐతే.. ఎరిస్ నుంచి మరో కొత్త వేరియంట్ గనుక ఇండియాలో పుడితే.. అది ప్రమాదకరం అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories