ఉపరాష్ట్రపతి నివాసంలో సైరా సినిమా ప్రదర్శన

ఉపరాష్ట్రపతి నివాసంలో సైరా సినిమా ప్రదర్శన
x
Highlights

-సైరా సినిమా ప్రమోషన్‌లో చిరంజీవి బిజీ -బీజేపీ జాతీయ నేత రాంమాధవ్‌‌తో కలిసి ఢిల్లీ వెళ్లిన చిరజీవి సాయంత్రం ఉపరాష్ట్రపతి నివాసంలో సైరా సినిమా ప్రదర్శన -సినిమా వీక్షించాలని ప్రధాని సహా కేంద్ర పెద్దలకు ఆహ్వానం -సినిమా ప్రమోషన్‌తోపాటు రాజకీయ చర్చలకు ఆస్కారం -ఢిల్లీలో మెగాస్టార్ చిరంజీవి పర్యటన

సైరా సినిమా ప్రమోషన్‌లో చిరంజీవి బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే సినీ రాజకీయ ప్రముఖులను ఆహ్వానించి సైరా సినిమాను ప్రదర్శించిన చిరంజీవి కేంద్ర పెద్దలకు కూడా మూవీని చూపించేందుకు ఢిల్లీ వెళ్లారు. తెలుగు వీరుడు, తొలి స్వతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సైరాను వీక్షించాలని ప్రధాని మోడీ సహా కేంద్ర పెద్దలను కోరనున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌‌తో కలిసి ఢిల్లీ వెళ్లిన చిరంజీవి కేంద్ర పెద్దల కోసం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసంలో సైరా సినిమా ప్రత్యేక షో ప్రదర్శించనున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories