Chief Justice of India 2021: సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ఎన్వీరమణ ప్రమాణం

Chief Justice of India 2021: సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ఎన్వీరమణ ప్రమాణం
x

ప్రమాణస్వేకరం చేస్తున్న ఎన్వీ రమణ (ఫైల్ ఇమేజ్)

Highlights

Chief Justice of India 2021: రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి కోవింద్‌

Chief Justice of India 2021: సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జస్టిస్‌ ఎన్వీ రమణ చేత ప్రమాణం చేయించారు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌. 2022 ఆగస్టు 26 వరకు ఎన్వీ రమణ పదవిలో కొనసాగనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు ప్రధాని మోడీ హాజరయ్యారు. ఎన్వీ రమణకు అభినందనలు తెలియజేశారు. కోవిడ్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

కృష్ణాజిల్లా పొన్నవరంలోని ఓ వ్యవసాయ కుటుంబంలో 1957 ఆగస్టు 27న జస్టిస్‌ ఎన్వీ రమణ జన్మించారు. ఎన్‌. గణపతిరావు, సరోజినిలు ఆయన తల్లిదండ్రులు. జస్టిస్‌ రమణ కంచికచర్లలో ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసి, అమరావతిలోని ఆర్‌.వి.వి.ఎన్‌ కళాశాలలో బీఎస్సీలో పట్టా పొందారు. 1982లో నాగార్జున విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా తీసుకుని 1983 ఫిబ్రవరి 10న అడ్వకేట్‌గా ప్రస్థానం మొదలుపెట్టారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, సెంట్రల్, ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునళ్లతో పాటు సుప్రీంకోర్టులో సివిల్, క్రిమినల్, రాజ్యాంగ, కార్మిక, సేవా, ఎన్నికల వ్యవహారాల్లో ప్రాక్టీస్ చేశారు జస్టి స్ ఎన్వీ రమణ. ఆంధ్రప్రదేశ్ అదనపు అడ్వకేట్ జనరల్‌గా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. 2000 జూన్ 27న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2003 మార్చి 10 నుంచి 2013 మే 20 వరకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రమణ పనిచేశారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2014లో సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు.

దేశ అత్యున్నత న్యాయ పీఠం అధిష్టించిన రెండో తెలుగు వ్యక్తిగా జస్టిస్ ఎన్వీ రమణ చరిత్ర సృష్టించారు. అంతకుముందు 1966 జూన్‌ 30 నుంచి 1967 ఏప్రిల్‌ 11 వరకు తెలుగు వ్యక్తి జస్టిస్‌ కోకా సుబ్బారావు సీజేఐగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు మళ్లీ 54 ఏళ్ల తర్వాత తెలుగు వ్యక్తి ఆ అత్యున్నత న్యాయం పీఠం ఎక్కారు. వచ్చే ఏడాది ఆగస్టు 26 వరకు జస్టిస్ ఎన్వీ రమణ చీఫ్ జస్టిస్‌గా వ్యవహరించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories