గేట్లు ఎక్కి చిదంబరం ఇంట్లోకి దూకిన అధికారులు ...

గేట్లు ఎక్కి చిదంబరం ఇంట్లోకి దూకిన అధికారులు ...
x
Highlights

చిదంబరం నివాసం వద్ద హైడ్రామా నెలకొంది. కాంగ్రెస్ కార్యాలయం నుంచి చిదంబరం ఇంటికి చేరుకున్నారు. అంతలోనే చిదంబరం ఇంటికి సీబీఐ, ఈడీ బృందాలు వచ్చేశాయి....

చిదంబరం నివాసం వద్ద హైడ్రామా నెలకొంది. కాంగ్రెస్ కార్యాలయం నుంచి చిదంబరం ఇంటికి చేరుకున్నారు. అంతలోనే చిదంబరం ఇంటికి సీబీఐ, ఈడీ బృందాలు వచ్చేశాయి. అయితే సిబ్బంది వారిని లోనికి అనుమతించలేదు. గేట్లు మూసివేశారు. ఈ నేపథ్యంలో సీబీఐ, ఈడీ అధికారులు గేటు దూకి లోనికి వెళ్లారు. ఇంట్లో చిదంబరంతో పాటు సిబాల్, సింఘ్వీ ఉన్నారు. ఏ క్షణంలోనైనా చిదంబరాన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

కొంతమంది అధికారులు ముందు గేటు నుంచి దూకి లోపలికి వెళ్తే మరికొంత మంది వెనుక నుంచి చిదంబరం నివాసంలోకి వెళ్లారు. ప్రస్తుతం చిదంబరం నివాసం వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. ఓ పక్క కాంగ్రెస్ కార్యకర్తలు, మరోపక్క సీబీఐ, ఈడీ అధికారులతో ఆ ప్రాంతంలో హైడ్రామా నెలకొంది.

చిదంబరం నివాసం చుట్టూ పోలీసు బలగాలు మోహరించాయి. సీబీఐ, ఈడీ అధికారులు ఏదోలా చిదంబరం నివాసంలోకి ప్రవేశించారు. చిదంబరం నివాసంలో ఏం జరుగుతోందోనన్న ఉత్కంఠ నెలకొంది. నివాసం బయట మొత్తం టెన్షన్ టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories