Jammu Kashmir: ఆర్మీ ట్రక్కులో మంటలు.. నలుగురు సైనికులు సజీవదహనం
Jammu Kashmir: ఘటనాస్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు
Jammu Kashmir: ఆర్మీ ట్రక్కులో మంటలు.. నలుగురు సైనికులు సజీవదహనం
Jammu Kashmir: జమ్మూకశ్మీర్లో ఘోరప్రమాదం జరిగింది. పూంచ్-జమ్మూ హైవేపై వెళ్తున్న ఆర్మీ ట్రక్కులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు సైనికులు సజీవదహనమయ్యారు. మరికొందరికి తీవ్రగాయాలు కాగా.. వారిని స్థానిక ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, సైనికులు.. ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. మంటల్లో ట్రక్కు పూర్తిగా కాలిబూడిదైంది. మరోవైపు.. ఘటనపై ఆర్మీ అధికారులు విచారణకు ఆదేశించారు.
Next Story




