వ్యవసాయం మరియు రైతుల సంక్షేమానికి 16 అంశాలు

వ్యవసాయం మరియు రైతుల సంక్షేమానికి 16 అంశాలు
x
Highlights

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగం 2020 లో వ్యవసాయం మరియు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని.. 16 అంశాల కార్యాచరణ ప్రణాళికను...

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగం 2020 లో వ్యవసాయం మరియు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని.. 16 అంశాల కార్యాచరణ ప్రణాళికను ప్రతిపాదించారు, ఈ అంశాలు అభివృద్ధికి మూడు వైపుల వ్యూహం "ఆకాంక్ష భారతదేశం" విభాగంలో భాగమని పేర్కొన్నారు.

దీనిలో మోడల్ అగ్రి ల్యాండ్ లీజింగ్ యాక్ట్, 2016; వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ సులభతరం చేయడానికి APMC, 2017 . కాంట్రాక్ట్ ఫార్మింగ్, 2018. అనే మోడల్ చట్టాలను అమలు చేసే రాష్ట్ర ప్రభుత్వాలను ప్రోత్సహిస్తున్నట్టు ఆర్థిక మంత్రి చెప్పారు.

కార్యాచరణ ప్రణాళిక యొక్క ముఖ్యమైన అంశాలు:

*రైతులకు సరైన ఎరువులు, తక్కువ నీరు వాడటం, ఎరువుల సమతుల్య వాడకాన్ని ప్రోత్సహించడం వంటి ప్రణాళికలను ప్రభుత్వం ప్రతిపాదించింది.

*100 జిల్లాలకు నీటి ఎద్దడి తీర్చడానికి సమగ్ర చర్యలు

*పంపులను సౌర గ్రిడ్‌కు అనుసంధానానికి వీలుగా రైతులకు సహాయపడటానికి "ఓర్జాడటా" లో చేర్చి అన్నదాత పథకాన్ని విస్తరిస్తున్నారు. ఇందులో భాగంగా బంజరు భూములు కలిగి ఉన్న రైతులు సౌర విద్యుత్ ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేస్తారు. అంతేకాదు వారు జీవించడానికి ఈ గ్రిడ్లను అమ్ముకోవచ్చు.

*20 లక్షల మంది రైతులకు సహాయం చేయడానికి పిఎం కుసుమ్ సోలార్ పంప్ పథకాన్ని విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

*నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) దేశవ్యాప్తంగా మ్యాప్ మరియు జియోట్యాగ్ గిడ్డంగుల కోసం ఒక కసరత్తు చేసింది.కొత్త వాటిని ఏర్పాటు చేయడానికి నిధులను అందిస్తుంది. ఫుడ్ కార్పొరేషన్ భూమిలో కూడా ఇటువంటి ప్రాజెక్టులను చేపట్టే అవకాశం ఉంది.

*గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు సాధికారత కల్పించడానికి స్వయం సహాయక సంఘాలు నిర్వహిస్తున్న గ్రామ నిల్వ పథకాలను ప్రతిపాదించారు. మహిళా స్వయం సహాయక సంఘాలు ధన్యలక్ష్మి పథకం కింద ముద్ర లేదా నాబార్డ్ లోన్ పొందవచ్చు.

*పాలు మరియు ఇతర పాడైపోయే ఉత్పత్తుల కోసం రైళ్లలో రిఫ్రిజిరేటెడ్ బోగీలతో కిసాన్ రైలును ఏర్పాటు చేయడానికి భారత రైల్వే సహాయం తీసుకుంటున్నారు.

*హార్టికల్చర్ రంగంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 311 మిలియన్ మెట్రిక్ టన్నులకు మించిపోయింది. దాంతో ప్రతి జిల్లాలో, రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో ఉత్పత్తిని ప్రోత్సహించాలని నిర్ణయించింది.

*వ్యవసాయేతర సీజన్లలో సౌరశక్తి, తేనెటీగ పెంపకం మొదలైనవాటిని ప్రోత్సహించడానికి వర్షాధార ప్రాంతాలలో సమగ్ర వ్యవసాయ వ్యవస్థలను విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది.

*ఆన్‌లైన్ సేంద్రీయ మార్కెట్ బలోపేతం చేయాలనీ నిర్ణయం.

*2025 నాటికి పాల ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని 108 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

*చేపల ఉత్పత్తి 2021-22 నాటికి 200 లక్షల టన్నులకు చేరుకుంటుందని ఆర్ధిక మంత్రి వెల్లడించారు.

*2021 నాటికి 15 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

*సముద్ర అభివృద్ధిలో భాగంగా ఆల్గే మరియు సీవీడ్ పెంపకాన్ని ప్రోత్సహిస్తారు.

*మత్స్య రంగంలో "సాగర్ మిత్రాస్" పేరుతో యువతను ప్రోత్సహించేందుకు వీలుగా 500 చేపల రైతు ఉత్పత్తి సంస్థలను ఏర్పాటు చేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories