బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
x
Highlights

రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే గైన్ చంద్ పరఖ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం నిర్మిస్తామని, అది కూడా వచ్చే నెలలో ప్రారంభిస్తామన్నారు.

రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే గైన్ చంద్ పరఖ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం నిర్మిస్తామని, అది కూడా వచ్చే నెలలో ప్రారంభిస్తామన్నారు. పాలీలో జరిగిన రాంలీలా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నవంబరు 17వ తేదీలోగా అయోధ్య రామజన్మభూమి కేసులో సుప్రీంకోర్టులో విచారణ ముగుస్తుందని, 18న రామమందిరం నిర్మాణం చేస్తామని గైన్ చంద్ వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై గతంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యల పట్ల పలు విమర్శలు వెల్లువెత్తున్నాయి. అయితే రామమందిర అంశం సుప్రీం కోర్టు పరిథిలో ఉంది. దీనిపై సుప్రీం ధార్మాసనం మధ్యవర్తిత్వాని కమిటీ నియమించిన సంగతి తెలిసిందే. వివాదాస్పద రామమందిరం కేసులో సుప్రీం నవంబర్ 17 తీర్పు వెల్లడించనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories