ప్రాణహాని ఉంది .. కోర్టును ఆశ్రయించిన బీజేపీ నేత కూతురు

ప్రాణహాని ఉంది .. కోర్టును ఆశ్రయించిన బీజేపీ నేత కూతురు
x
Highlights

బలవంతంగా మరో యువకుడికి ఇచ్చి వివాహం చేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే సురేంద్రనాథ్‌సింగ్ పై కూతురు హైకోర్టు ఆశ్రయించింది. కుటుంబ సభ్యుల...

బలవంతంగా మరో యువకుడికి ఇచ్చి వివాహం చేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే సురేంద్రనాథ్‌సింగ్ పై కూతురు హైకోర్టు ఆశ్రయించింది. కుటుంబ సభ్యుల నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని, వారి వేధింపులు తట్టుకోలేక అజ్ఞాతంలోకి వెళ్లానని తన న్యాయవాది ద్వారా హైకోర్టుకు తెలిపారు. వారి నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరారు. మధ్యప్రదేశ్ రాష్ట్రాకి చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే సురేంద్రనాథ్‌సింగ్ అక్టోబర్‌ 16న తన కూతురు తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో సురేంద్ర నాథ్ సింగ్ ఆరోపణలను ఖండిస్తూ అతని కూతురు భారతీ సింగ్ వీడియోను విడుదల చేశారు. అందులో తాను ఎక్కడికి వెళ్లలేదని, ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపింది. తన కుటుంబ సభ్యులు మానసిన పరిస్థితి బాగోలేదంటూ తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించారన్నారు. ఓ రాజకీయ నాయకుడి తనయుడితో ఇష్టం లేని పెళ్లి నిర్ణయించారని ఎన్ని సార్లు చెప్పినా కుటుంబ సభ్యులు వినడంలేదని తెలిపారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించమని వీడియో ద్వారా భారతీ సింగ్ కోర్టును వేడుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories