భారత్లో ఆరేళ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్న సందర్భంగా, అలాగే పండుగల సీజన్ కావడంతో ప్రముఖ ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్.. 'గ్రేట్ ఇండియన్...
భారత్లో ఆరేళ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్న సందర్భంగా, అలాగే పండుగల సీజన్ కావడంతో ప్రముఖ ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్.. 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్' పేరిట భారీ ఆఫర్లకు తెరదీసింది. ఈనెల 29 నుంచి అక్టోబర్ 4 వరకు ఈ ఆఫర్ ఉంటుంది.. అయితే అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం కలిగినవారు సెప్టెంబర్ 28 మధ్యాహ్నం 12 గంటలకే ఆఫర్లను అందుకోవచ్చు. ఈసారి ఆఫర్లో భారీ డిస్కౌంట్లు ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపు చేసివారికి 10 శాతం తక్షణ డిస్కౌంట్ కూడా ప్రకటించింది. ఈ ఆఫర్ లో భాగంగా లక్షకు మించిన ఫ్యాషన్ డీల్స్, 1200 బ్రాండ్స్ ఉంటాయని వెల్లడించింది. దుస్తులు, పాదరక్షలు, వాచీలపై 80 శాతం, నగలపై 90 శాతం, బెస్ట్ సెల్లింగ్ బుక్స్పై 70 శాతం, బ్లూ టూత్లపై 70 శాతం ,
ఇక నిత్యావసర వస్తువులు, కిచెన్ ఉత్పత్తులపై 80 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది. ఈ విభాగంలో 50వేలకు మించి ఉత్పత్తులు ఉన్నట్టు తెలిపింది. వీటిలో సగానికి పైగా వస్తువులపై 50 శాతం డిస్కౌండ్ ఉండనుందని వెల్లడించింది. ఆట బొమ్మలపై కూడా డిస్కౌంట్ ఇస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఇటు స్మార్ట్ఫోన్లపై 40 శాతం డిస్కౌంట్, అలాగే అదనపు క్యాష్బ్యాక్, నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లను ఇందులో అందించనుంది. శాంసంగ్, వన్ప్లస్, షావోమీ, ఓపో, వివో వంటి ప్రఖ్యాత బ్రాండ్లు అందుబాటులో ఉండగా.. ఎక్సే్ఛంజ్ ఆఫర్ కింద రూ. 6,000 వరకు ఇవ్వనున్నట్టు అమెజాన్ పేర్కొంది. టాప్లోడ్ వాషింగ్ మెషిన్ ప్రారంభ ధర రూ. 9,999 కాగా, స్ప్లిట్ ఏసీలపై 45 శాతం వరకు తగ్గింపు ఉందని ప్రకటించింది. రూ. 99 ప్రారంభ ధర నుంచి ఉత్పత్తులు ఉన్నట్లు తెలిపింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire