Belagavi: కర్ణాటక, మహారాష్ట్ర మధ్య మళ్లీ చిచ్చు..మళ్లీ తెరపైకి సరిహద్దు వివాదం

Belagavi: కర్ణాటక, మహారాష్ట్ర మధ్య మళ్లీ చిచ్చు..మళ్లీ తెరపైకి సరిహద్దు వివాదం
x
Highlights

Belagavi: బెళగావిపై కర్నాటక, మహారాష్ట్ర మధ్య మళ్లీ చిచ్చురేగుతోంది. రెండు రాష్ట్రాల మధ్య ఏండ్లుగా నడుస్తున్న సరిహద్దు వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది....

Belagavi: బెళగావిపై కర్నాటక, మహారాష్ట్ర మధ్య మళ్లీ చిచ్చురేగుతోంది. రెండు రాష్ట్రాల మధ్య ఏండ్లుగా నడుస్తున్న సరిహద్దు వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. మరాఠీలో బదులివ్వనందుకు శుక్రవారం బెళగావిలో కర్నాటకకు చెందిన ఓ కండక్టర్ కు చితకబాదారు. దీనికి ప్రతిగా శనివారం కర్నాటకలోని చిత్రదుర్గలో మహారాష్ట్రకు చెందిన కండక్టర్ పై కొందరు దాడి చేసి నల్ల రంగును పూశారు. ఈ రెండు దాడులతో రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. ముందు జాగ్రత్త చర్యగా ఇరు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులను నిలిపివేశారు.

బెళగావిలో శుక్రవారం కర్నాటక కండక్టర్ పై జరిగిన దాడి తాజా ఉద్రిక్తతలకు కారణం అయ్యింది. ప్యాసింజర్ కు మరాఠీలో బదులివ్వనందుకు కొందరు కండక్టర్ పై దాడికిపాల్పడ్డారు. కండక్టర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం..ఓ బాలిక తనకు టికెట్ కావాలని మరాఠీలో అడిగింది. అయితే తనకు మరాఠీ రాదని కన్నడలో చెప్పాలని కండక్టర్ చెప్పారు. దీంతో బాలిక, ఆమెతో వచ్చిన వ్యక్తిపై దాడి చేశారని కండక్టర్ తెలిపారు. ఈ క్రమంలో కొందరు బస్సును ఆపి కండక్టర్ పై దాడికి పాల్పడటంతో ఉద్రిక్తత పెరిగింది. ఘటనకు సంబంధించి నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కండక్టర్ పై కూడా పోక్సో కేసు నమోదు అయ్యింది. తనపై అనుచితంగా ప్రవర్తించాలని బాలిక కంప్లెయింట్ చేసింది. ఈ ఘటనకు ప్రతీకార చర్యగా కర్నాటకలోని చిత్ర దుర్గ జిల్లాలో మహారాష్ట్రకు చెందిన కండక్టర్ పై కొందరు దాడి చేసి ఇంకును పూశారు. ఘటనకు సంబంధించి పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.

బెళగావి ప్రాంతంలో కర్నాటకలోనే ఉన్నప్పటికీ ఇక్కడ మరాఠీల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. భాష ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు సమయంలో బెళగావితోపాటు పలు సరిహద్దు గ్రామాలను తప్పుగా కర్నాటకకు అప్పగించాలని మహారాష్ట్ర వాదిస్తుంది. అయితే దీనిని కర్నాటక ప్రభుత్వం తిరస్కరిస్తూ వస్తోంది. ఆ ప్రాంతం తమదే అంటూ గట్టిచెప్పేందుకు ఆ ప్రభుత్వం అక్కడ సువర్ణ విధాన సౌధను నిర్మించి ఏడాదికి ఒకసారి సమావేశం నిర్వహిస్తోంది. 1966లో మహాజన్ కమిషన్ కర్నాటకకు అనుకూలంగా రూలింగ్ ఇచ్చింది. అయితే ఈ నిర్ణయాన్ని తిరస్కరించిన మహారాష్ట్ర సర్కార్..2004లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి ఈ కేసు పెండింగ్ లోనే ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories