భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం .. గ‌త 24 గంట‌ల్లో 6,654 కేసులు..

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం .. గ‌త 24 గంట‌ల్లో 6,654 కేసులు..
x
Highlights

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే...

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన తర్వాత దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో అత్యధికంగా 6,654 కేసులు నమోదు కాగా, 137 మంది ప్రాణాలు విడిచారు.

దేశంలో ఒక్క రోజులో అత్య‌ధిక స్థాయిలో కేసులు న‌మోదు కావ‌డం ఇదే తొలిసారి. దీంతో ఇండియాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,25,101కి చేరింది. వీరిలో 51,783 మంది కోలుకోగా.. 69,597 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక మ‌ర‌ణాల సంఖ్య మొత్తం 3720కి చేరుకున్న‌ట్లు ఆరోగ్య‌శాఖ పేర్కొన్న‌ది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories