ఢిల్లీలో కరోనా ఉద్ధృతి.. 24 గంటల్లో..

ఢిల్లీలో కరోనా ఉద్ధృతి.. 24 గంటల్లో..
x
Representational Image
Highlights

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ 4.0 విధించినప్పటికి కరోనా కేసులు మాత్రం ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా ఉద్ధృతి...

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ 4.0 విధించినప్పటికి కరోనా కేసులు మాత్రం ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 591 కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 12910కి పెరిగింది. ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల్లో 6412 యాక్టివ్‌గా ఉండగా, 6267 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 218 మంది మరణించారు.

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన తర్వాత దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో అత్యధికంగా 6,654 కేసులు నమోదు కాగా, 137 మంది ప్రాణాలు విడిచారు. దీంతో ఇండియాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,25,101కి చేరింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories