
PM Gati Shakti: భారత అభివృద్ధిని నిర్ణయించే 434 మెగా ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.11.17 లక్షల కోట్ల భారీ మొత్తాన్ని ఖర్చు చేయనుంది. ప్రధాన...
PM Gati Shakti: భారత అభివృద్ధిని నిర్ణయించే 434 మెగా ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.11.17 లక్షల కోట్ల భారీ మొత్తాన్ని ఖర్చు చేయనుంది. ప్రధాన మంత్రి గతి శక్తి యోజన కింద అమలుకానున్న ఈ ప్రాజెక్టులు భారతదేశ లాజిస్టిక్ రంగాన్ని పూర్తిగా మార్చివేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.
వేగవంతమైన రవాణా – మెరుగైన కనెక్టివిటీ
ఈ ప్రాజెక్టుల ద్వారా రోడ్లు, రైళ్లు, నీటిమార్గాలు, విమాన రవాణా రంగాల్లో మెరుగుదల తీసుకురావడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పోర్ట్ కనెక్టివిటీ, హై ట్రాఫిక్ డెన్సిటీ రూట్లు, ఎనర్జీ-మినరల్-సిమెంట్ కారిడార్లు నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నారు.
* 192 ఎనర్జీ, మినరల్, సిమెంట్ కారిడార్లు
* 200 హై ట్రాఫిక్ డెన్సిటీ రూట్లు
* 42 పోర్ట్ కనెక్టివిటీ రూట్లు
ఈ ప్రాజెక్టుల్లో 156 ప్రాజెక్టుల డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) ఇప్పటికే సిద్ధంగా ఉంది. వీటిలో 68 ప్రాజెక్టుల కోసం 6,290 కిలోమీటర్ల కొత్త ట్రాక్లను అభివృద్ధి చేసేందుకు రూ.1,11,663 కోట్లు ఖర్చు చేయనున్నారు.
లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గించి, వినియోగదారులకు ప్రయోజనం
ఈ ప్రాజెక్టుల ద్వారా పరిశ్రమలు తమ ఉత్పత్తులను తక్కువ ఖర్చుతో వేగంగా తరలించగలవు. ఫలితంగా, దేశీయంగా వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా, భారత ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో పోటీకి సిద్ధమవుతాయి.
కొత్త కార్గో టెర్మినల్స్
* ఇప్పటివరకు 91 కొత్త కార్గో టెర్మినల్స్ మంజూరు చేయబడ్డాయి.
* అదనంగా 339 కొత్త టెర్మినల్స్ అభివృద్ధికి పరిశీలనలో ఉన్నాయి.
ఈ మెగా ప్రాజెక్టుల అమలు ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, ఉద్యోగ అవకాశాలు పెరిగి దేశం అభివృద్ధి దిశగా పయనిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




