ఢిల్లీలో ఒకే చోట 38 కరోనా కేసులు... మూడో అతిపెద్ద హాట్ స్పాట్ ఇదే!

ఢిల్లీలో ఒకే చోట 38 కరోనా కేసులు... మూడో అతిపెద్ద హాట్ స్పాట్ ఇదే!
x
Highlights

ఢిల్లీలో కరోనావైరస్ మహమ్మారి మరింత ఆందోళనకు గురిచేస్తోంది. పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి.

ఢిల్లీలో కరోనావైరస్ మహమ్మారి మరింత ఆందోళనకు గురిచేస్తోంది. పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో దక్షిణ ఢిల్లీ పరిధిలోని తుగ్లకాబాద్ లో 38 మందికి వైరస్ సోకినట్టు నిర్దారణ కావడంతో.. దీనిని హాట్ స్పాట్ గా గుర్తించారు. దేశ రాజధానిలో ఇది మూడో అతిపెద్ద హాట్ స్పాట్ నిలిచింది. మొదట్లో ఇక్కడ ముగ్గురికి వైరస్ సోకింది. వారిలో ఓ వ్యక్తి నిత్యావసరాల దుకాణం నడుపుతున్నాడు. అయితే ఆ తరువాత ఈ ప్రాంతంలోని 94 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షలు చేయగా.. అందులో 35 మందికి వైరస్ సోకినట్టు తేలింది. దీంతో అధికారుల్లో అలజడి మొదలయింది.

తుగ్లకాబాద్ పరిసర ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ప్రాంతాన్నంతా అధికారులు సీజ్ చేశారు, కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. అలాగే పాజిటివ్ సోకిన ఈ 35 మందితోనూ కాంటాక్ట్ అయిన వారందరి వివరాలను సేకరించే పనిలో పడ్డారు. కొందరిని ట్రేస్ చేసి క్వారంటైన్ చేసేందుకు చర్యలు చేపట్టారు. కాగా, న్యూఢిల్లీలో అతిపెద్ద కరోనా హాట్ స్పాట్ గా నిజాముద్దీన్ నిలిచిన సంగతి తెలిసిందే. ఇక్కడ తబ్లీగి జమాత్ లో మత ప్రార్థనల కారణంగా, దేశంలో వేలాది మందికి వైరస్ సోకింది. అలాగే ఢిల్లీలో రెండో హాట్ స్పాట్ గా చాందినీ మహల్ ప్రాంతం ఉంది. ఇక్కడ కూడా అధిక వైరస్ కేసులు నమోదయ్యాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories