చికిత్స పొందుతూ ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతి

చికిత్స పొందుతూ ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతి
x
Highlights

మృత్యువుతో పోరాడుతూ ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలు మృతి చెందింది. ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె రాత్రి 11.40 గంటల సమయంలో...

మృత్యువుతో పోరాడుతూ ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలు మృతి చెందింది. ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె రాత్రి 11.40 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌కు చెందిన ఆమెపై గత డిసెంబరులో దుండగులు అత్యాచారం చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా గురువారం రాయ్‌బరేలీలోని న్యాయస్థానానికి హాజరయ్యేందుకు బయలుదేరిన ఆమెను ప్రధాన నిందితులు దారిలో అటకాయించారు. అనంతరం ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. బాధితురాలు కేకలు వేస్తూ కిలోమీటరు మేర పరుగులు తీసింది. ఓ వ్యక్తి సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు బాధితురాలుండే ప్రదేశానికి చేరుకుని సత్వర చికిత్స అందించేందుకు చర్యలు తీసుకున్నారు. బాధితురాలికి మెరుగైన చికిత్స అందించేందుకు ఉత్తరప్రదేశ్‌ నుంచి ఎయిర్‌ ఆంబులెన్స్‌లో ఢిల్లీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories