సీజేఐకి లేఖ రాసిన 21 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు

21 Retired Judges Written A Letter To The CJI
x

సీజేఐకి లేఖ రాసిన 21 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు

Highlights

న్యాయవ్యవస్థను కాపాడుకోవాలని అభిప్రాయం

సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులకు చెందిన 21 మంది రిటైర్డ్‌ న్యాయమూర్తులు సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ రాశారు. న్యాయవ్యవస్థను కాపాడుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయని అభిప్రాయపడ్డారు. కొన్ని వర్గాలు తప్పుడు సమాచారం అందిస్తూ న్యాయ వ్యవస్థను బహిరంగంగా అవమానిస్తున్నారని, అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. కొందరు వారి వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం విపరీత చర్యలకు పాల్పడుతున్నారని, దానివల్ల ప్రజలు న్యాయవ్యవస్థపై నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వారు తమ లేఖలో ప్రతిపక్షాలపై అవినీతి కేసులు, బాధిత నాయకులు న్యాయస్థానాలను ఆశ్రయించినా వారికి ఎటువంటి ఉపశమనం దక్కకపోవడం మొదలైన విషయాల గురించి పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories