Coronavirus Updates: భారత్‌లో కొత్తగా 11,502 కరోనా పాజిటివ్‌ కేసులు

Coronavirus Updates: భారత్‌లో కొత్తగా 11,502 కరోనా పాజిటివ్‌ కేసులు
x
Highlights

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే...

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 11,502 కేసులు నమోదు కాగా, 325 మంది ప్రాణాలు విడిచారు. గత మూడురోజులుగా దేశంలో నిత్యం 11వేలకు పైగా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 3,32,424 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,53,106 ఉండగా, 1,69,797 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 9,520 మంది కరోనా వ్యాధితో మరణించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories