ఈ సంఘటనని గుర్తుచేసుకుంటూ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. "2008లో ముంబై ఉగ్రవాద దాడి
దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబైలో 2008 నవంబరు 26న ఉగ్రమూకలు మారణ హోమాన్ని సృష్టంచిన ఘటనని ఏ ఒక్క భారతీయుడు కూడా తన జీవితంలో మరిచిపోలేడు. ఈ ఘటన జరిగి నేటికి పదకొండేళ్ళు అవుతుంది. లష్కరే తోయిబాకి చెందిన 10మంది తీవ్రవాదులు శివాజీ టెర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్మహల్ ప్యాలెస్ హోటల్పై దాడులకి దిగారు, ఆ దాడులలో మొత్తం 166మంది చనిపోగా మరో 300 మంది క్షతగాత్రులు అయ్యారు. ఇందులో తన ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడారు మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కారే.. ఈ దాడికి కారకులు అయిన వారిలో ముఖ్యుడైనా అజ్మల్ కసబ్ ని 2012 లో భారత్ ఉరితీసింది.
ఈ సంఘటనని గుర్తుచేసుకుంటూ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. "2008లో ముంబై ఉగ్రవాద దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ నా హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఈ సందర్భంగా దేశాన్ని కాపాడటంలో ప్రాణత్యాగం చేసిన భద్రతా బలగాలకు నివాళులర్పిస్తున్నాను. వారి త్యాగాలను దేశం ఎన్నటికీ మరవదు" అంటూ ట్వీట్ చేశారు.
2008లో ముంబై ఉగ్రవాద దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ నా హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఈ సందర్భంగా దేశాన్ని కాపాడటంలో ప్రాణత్యాగం చేసిన భద్రతా బలగాలకు నివాళులర్పిస్తున్నాను. వారి త్యాగాలను దేశం ఎన్నటికీ మరవదు. #MumbaiTerrorAttack
— Vice President of India (@VPSecretariat) November 26, 2019
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire