ఖైదీతో పెళ్లికి మూడేళ్లు ఆగింది... బెయిల్ రాలేదని జైలుకెళ్లి పెళ్లిచేసుకుంది

ఖైదీతో పెళ్లికి మూడేళ్లు ఆగింది... బెయిల్ రాలేదని జైలుకెళ్లి పెళ్లిచేసుకుంది
x
Highlights

ఓ జీవితఖైదీని పెళ్లి చేసుకోవడానికి మూడేళ్లు ఎదురుచూసింది అతని ప్రియురాలు. కోర్టు అతడికి పెరోల్ నిరాకరించడంతో చివరికి జైలుకు వెళ్లి పెళ్లి చేసుకుంది.

ఓ తెలుగు సినిమాలో హీరో హిరోయిన్ మెడలో జైల్లో తాళి కడతాడు. అచ్చం ఇలాంటి అరుదైన ఘటన పంజాబ్‌లోని ఓ జైలులో జరిగింది. ఓ జీవితఖైదీని పెళ్లి చేసుకోవడానికి మూడేళ్లు ఎదురుచూసింది అతని ప్రియురాలు. చివరికి జైలుకు వెళ్లి అతడిని పెళ్లి చేసుకుంది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన మన్‌దీప్ సింగ్ పదేళ్ల కిందట తమ గ్రామ సర్పంచిని, అతడి అనుచరుడిని దారుణంగా హత్య చేశాడు. ఈ కేసును విచారించిన కోర్టు మన్‌దీప్ సింగ్ కు జీవిత ఖైదు విధించింది.

అయితే 2016లోనే మన్‌దీప్ వివాహం చేసుకోడానికి పెళ్లి కుమార్తె పవన్ దీప్ సింగ్ అగీకరించింది. దీంతో మన్‌దీప్ ఆమెను పెళ్ళి చేసుకోవడానికి పెరోల్ కోసం కోర్టును ఆశ్రయించాడు. మన్ దీప్ కు బెయిల్ ముంజూరు చేస్తే సమస్యలు వస్తాయని పోలీసులు కోర్డులో తమ వాదన వినిపించారు. దీంతో కోర్టు మన్‌దీప్ పెరోల్ ఇవ్వడానికి నిరాకరించింది. జైల్లో పెళ్ళి చేసుకోవడానికి అవసరమైన ఏర్పట్లు చేయాలని అధికారులను ఆదేశించింది.

అధికారులు బుధవారం మన్‌దీప్ సింగ్‌, పెళ్లికూతురు పవన్ దీప్ సింగ్‌లకు పెళ్లి చేశారు. జైలులోని గురుద్వారాలో ఈ పెళ్లి తంతును అధికారులు ముగించారు. పవన్ దీప్ సింగ్ , మన్‌దీప్ సింగ్‌ను వివాహం చేసుకోవడానికి మూడేళ్లు ఏదురుచూసింది. ఈ వేడుకలకు పెళ్లికి మన్‌దీప్ తల్లి హాజరైయ్యారు. పెళ్లి కూతురు వెంట ఆమె కుటుంబ సభ్యులు హాజరైయ్యారు. ఆరు కుటుంబాలకు జైల్లో ఆరు గంటల వరకూ గడిపేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories