అమరవీరుల స్మారక చిహ్నం వద్ద ఒంటరిగా సాయి పల్లవి!

అమరవీరుల స్మారక చిహ్నం వద్ద ఒంటరిగా సాయి పల్లవి!
x
Sai Pallavi First Look From Virataparvam
Highlights

హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ మంచి పేరు సంపాదించుకుంది. స్వతహాగా మలయాళం అమ్మాయి అయినప్పటికీ తెలుగులో తనకు తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటుంది. ఇక డాన్స్ లో కూడా ప్రత్యేకత చాటుకుంటోంది.. సాయి పల్లవి ఈరోజు (మే 9) పుట్టినరోజు జరుపుకుంటుంది.. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న 'విరాటపర్వం' సినిమా నుంచి సప్రైజ్ లూక్ ని విడుదల చేసింది చిత్ర బృందం..

దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న విరాట పర్వం చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు.. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి హీరో రానా లుక్ బయటకు వచ్చి సినిమా పైన మంచి హైప్ క్రియేట్ చేసింది. తాజాగా సాయి పల్లవి లుక్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. లంగాఓణీలో, అమరవీరుల స్మారక చిహ్నం వద్ద పక్కన బ్యాగ్ పెట్టుకొని, ఒంటరిగా కూర్చొని కనిపిస్తుంది. ఇందులో సాయి పల్లవి నక్సలైట్ పాత్రలో కనిపించనుందని తెలుస్తుంది.

చూస్తుంటే సాయి పల్లవి రోల్ చిత్రానికే ప్రధాన అసెట్ అని తెలుస్తోంది. ఇక ఇదే లుక్ పై దర్శకుడు వేణు ఊడుగుల ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.."అడవి మార్గాన ఉన్న ఆ అమరవీరుల స్తూపం దగ్గరే ఆమె ఎందుకు ఒంటరిగా కూర్చుంది?ఎవరి కోసం ఆమె నిరీక్షణ ?ఆమె ఒడిలోని డైరీలో రాసి ఉన్న అక్షరాలేమిటి? ఆమె పక్కనున్న బ్యాగ్ లో ఉన్నవేమిటి? ఈ ప్రశ్నలకు జవాబులు విడుదల తర్వాతే... " అంటూ ట్వీట్ చేశారు. కరోనా వైరస్ ప్రభావంతో సినిమా షూటింగ్ వాయిదా పడింది. లాక్ డౌన్ అనంతరం సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories