'బాలను రా మదనా' అంటూ 84 ఏళ్ల వయసులో కూడా జమున నాట్యం..

బాలను రా మదనా అంటూ 84 ఏళ్ల వయసులో కూడా జమున నాట్యం..
x
Actress Jamuna
Highlights

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. సినీతారలాంతా షూటింగ్స్ లేక ఇళ్లలోనే వుంటూ.. అభిమానులకు కరోనా వైరస్ పై జాగ్రత్తలు చెబుతున్నారు.

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. సినీతారలాంతా షూటింగ్స్ లేక ఇళ్లలోనే వుంటూ.. అభిమానులకు కరోనా వైరస్ పై జాగ్రత్తలు చెబుతున్నారు.కొందరు మాటల రూపంలో.. మరికొందరైతే పాటల రూపంలో చైతన్య పరుస్తున్నారు. కొందరు నటీనటులు అయితే వంట పని, ఇంటి పని చేసిన వీడియోలు సోషల్ మీడయాలో షేర్ చేస్తున్నారు.

అయితే అలాంటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ పరవశంతో నృత్యం చేస్తూ ఔరా అనిపిస్తున్నారు 84 ఏళ్ల సీనియర్ నటి అలనాటి సత్యభామ జమున. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జమున కలిసి నటించిన 'మిస్సమ్మ' చిత్రం ఓ టెలివిజన్ ఛానల్ లో ప్రసారం చేశారు. ఆ సినిమాను చూస్తున్న జమున 'బాలను రా మదనా' పాట రాగానే నడుముపై చేతులు పెట్టుకుని అప్పట్లో తాను ఎలాగైతే నాట్యం చేశారో అలాగే చేస్తూ అబ్బురపరిచారు.

అప్పట్లోని తన డాన్స్‌పై తానే సెటైర్స్ వేసుకుంటూ తెగ నవ్వించారు. ఈ వీడియోను జమున కూతురు స్రవంతి ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వాళ్ళంతా 65 ఏళ్ల క్రితం వచ్చిన సినిమాలో జమున ఎలా నాట్యం చేశారో ఇప్పుడు అలానే చేశారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories