వేణుమాధవ్ నన్ను, జీవితను అలా పిలిచేవాడు : హీరో రాజశేఖర్

వేణుమాధవ్ నన్ను, జీవితను అలా పిలిచేవాడు : హీరో రాజశేఖర్
x
Highlights

వేణుమాధవ్ నన్ను, జీవితను అలా పిలిచేవాడు : హీరో రాజశేఖర్

ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్‌ మరణంతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి విషాదంలో మునిగిపోయింది. దీంతో వేణుమాధవ్ పార్ధివదేహాన్ని చూసేందుకు ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు. వేణుమాధవ్ మరణం తమకు తీరని లోటని హీరో రాజశేఖర్‌ అన్నారు. వేణుమాధవ్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన రాజశేఖర్.. వేణుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 'వేణుమాధవ్‌ మా కుటుంబానికి ఎంతో సన్నిహితంగా ఉండేవారు. నన్ను బావా అని, జీవితను అక్క అని పిలిచేవాడు. ప్రతి పండక్కి తప్పకుండా ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపేవాడు. ఒకవేళ కుదరకుంటే కనీసం మెసేజ్‌ చేసైనా విష్‌ చేసేవాడు.

మేమంటే తనకు అంత అభిమానం. నా పక్కన పది సినిమాల్లో నటించాడు.. 'రాజ సింహం', 'ఒక్కడు చాలు', 'మనసున్న మారాజు', 'గోరింటాకు' చిత్రాల్లో తన నటనకు, హాస్యానికి మంచి పేరు వచ్చింది. ప్రతి ఒక్కరినీ వరుసలు పెట్టి పిలుస్తూ కుటుంబంలా కలుపుకుని వెళ్లేవారు. వేణుమాధవ్ అనారోగ్యానికి గురైనప్పుడు జీవితతో కలిసి హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించి వచ్చాను.. కానీ అంతలోపే ఇలా జరగడం దురదృష్టకరం.. మంచి మనిషి ఇంత త్వరగా లోకాన్ని విడిచి వెళతాడని అనుకోలేదు. అని వేణుమాధవ్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు రాజశేఖర్..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories