నితిన్ చీట్ చేశాడు : వరుణ్ తేజ్

నితిన్ చీట్ చేశాడు : వరుణ్ తేజ్
x
Bheeshma Movie thank you meet In Vizag (File Photo)
Highlights

యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం 'భీష్మ'.. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ మహాశివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల...

యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం 'భీష్మ'.. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ మహాశివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో నితిన్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకి ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వం వహించగా, సీతార ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాని నిర్మించింది. సినిమాకి మొదటి షో నుంచే మంచి టాక్ వచ్చింది.

ఆడియన్స్ నుంచి రివ్యూలు వరకు ఎక్కడ చూసిన అసలు జనాలు సీట్లలో కూర్చుంటేగా అన్నట్టుగానే సాగింది. అడుగడుగునా పంచెస్ తో,బ్యాక్ బ్యాక్ హిలేరియస్ సీన్స్ తో కితకితలు పెట్టి కామిడీ సన్నివేశాలు, నితిన్ డాన్స్, రష్మిక అందాలు, పాటలు, ఫైట్స్ ఇలా అన్ని వేటికవే సమానంగా నిలిచాయి. సినిమా మంచి విజయాన్ని సాధించడంతో చిత్ర యూనిట్ వైజాగ్ లో థాంక్ యు మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగా హీరో వరుణ్ తేజ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వరుణ్ మాట్లాడుతూ.. " నిజంగా నా సినిమా హిట్టయితే ఎంత హ్యాపీగా ఫీలవుతానో, దానికంటే ఎక్కువగా నితిన్ సినిమా సక్సెస్ అయినందుకు హ్యాపీగా ఫీలయ్యానని అన్నారు. వెంకీ కుడుముల మొదటి సినిమా 'ఛలో' చూసి చాలా ఎంజాయ్ చేశానని, సాధారణంగా ఇండస్ట్రీలో సెకండ్ సినిమా హిట్ కొట్టడం కొంచెం కష్టమంటారు. వెంకీ ఆ పరీక్ష పాసయ్యాడని అన్నాడు. అతను మరిన్ని సక్సెస్ లు అందుకోవాలని కోరుకుంటున్నానని వరుణ్ అన్నాడు.

అంతేకాకుండా నితిన్ సినిమానంతా జెన్యూన్ గా తీసి, ఒక విషయంలో మోసం చేశాడని వరుణ్ ఫన్నీ కామెంట్స్ చేశాడు. 'భీష్మ.. సింగిల్ ఫరెవర్' అని చెప్పి ఫస్ట్ రీల్ అయ్యేవరకు అమ్మాయిని పడేశాడు. సింగిల్ గా ఉంటానని చెప్పి, సినిమా విడుదలకు ముందు ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. మమ్మల్ని మోసం చేశాడని వరుణ్ అన్నాడు. షాలినీతో కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నందుకు నితిన్ కి అభినందనలు తెలిపాడు వరుణ్.. ఈ కార్యక్రమంలో హీరో నితిన్ , హీరోయిన్ రష్మిక మందన్నా, గేయరచయిత కాసర్ల శ్యామ్, అజయ్, సంపత్ , వెంకీ కుడుముల, నాగవంశీ తదితరులు పాల్గొన్నారు.

ఇక ఈ సినిమా తర్వాత నితిన్ విభిన్నమైన కథలను తెరకెక్కించే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమాని, తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే చిత్రంలో నటిస్తున్నాడు. రంగ్ దే చిత్రంలో నితిన్ కి జోడిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమాని చేసేందుకు పిక్స్ అయ్యాడు నితిన్.. ఈ సినిమాలు ఈ సంవత్సరంలోనే విడుదల చేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories