టాలీవుడ్ అగ్రకథనాయకుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’.
టాలీవుడ్ అగ్రకథనాయకుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించి తాజా వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా త్రిషను తీసుకున్నారు. అయితే ఈ ప్రాజెక్టు నుంచి త్రిష వైదొలిగినట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఓ ట్విట్ చేశారు. కొన్ని విషయాలు మొదట చెప్పినట్లు, చర్చించుకున్నట్లు భిన్నంగా మారుతుంటాయి. క్రియేటివ్ అంశంలో భిన్నాభిప్రాయాల వల్ల చిరంజీవి గారి చిత్రంలో నటించకూడదని అనుకున్నా. సినిమా యూనిట్కు నా అభినందనలు. తెలుగు ప్రేక్షకులను మరొక మంచి ప్రాజెక్టుతో కలుస్తానని ఆశిస్తున్నా' అని త్రిష ట్విట్ చేశారు.
గతంలో చిరంజీవి, త్రిష కలిసి స్టాలిన్ సినిమాలో నటించారు. అప్పట్లో వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా మంచి విజయం అందుకుంది. చాలా కాలం తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కానీ త్రిష ఈ సినిమా నుంచి అర్థంతరంగా తప్పుకున్నారు. త్రిష ప్రస్తుతం తమిళంలో 'పరమపదం విలయాట్టు', 'రాంగీ',పలు చిత్రాల పాజెక్టులు ఉన్నాయి. మరో సారి చిరు - త్రిష జోడిని వెండితెరపై చూడబోతుండటంతో సంతోషం ఆవిరైనట్లే
Sometimes things turn out to be different from what was initially said and discussed.Due to creative differences,I have chosen not to be part of Chiranjeevi sirs film.Wishing the team https://t.co/sfaMfRrWmT my lovely Telugu audiences-hope to see you soon in an exciting project.
— Trish (@trishtrashers) March 13, 2020
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire